హైదరాబాద్ నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల 45నిమిషాల సిట్ విచారణ కొనసాగింది. పలు కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు. విచారణ తర్వాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్ సమావేశం అయ్యారు. విచారణ తర్వాత తన నివాసంలో నుంచి కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం చేశారు.

ఈ విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు కేసీఆర్కు వేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయం చుట్టూనే ఎక్కువగా ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. గతంలోని పలువురి వాంగ్మూలాల ఆధారంగా సిట్ ప్రశ్నలు తయారు చేసుకుంది.
ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెుదలైందనే ప్రశ్నను కూడా కేసీఆర్కు అధికారులు వేశారు. కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు? అని దీనికి అనుబంధం ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా? అని కూడా అడిగారని అంటున్నారు.
మరోవైపు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పదవీకాలం గురించి ఇప్పటికే సంతోష్ రావుకు కూడా ప్రశ్నలు వేశారు సిట్ అధికారులు. తాజాగా కేసీఆర్కు కూడా ప్రశ్నలు సంధించారు. పదవీకాలం ముగిసిన తర్వాత.. ప్రభాకర్ రావు పదవిని మళ్లీ ఎందుకు పొడిగించారని అడిగినట్టుగా తెలుస్తోంది. దీని వెనక కారణాలు ఏంటి అని సిట్ అధికారులు కేసీఆర్కు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.
ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి కూడా.. సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసిందని అడిగారు. ఆ విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసిందా? అని కూడా అనుబంధ ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.
{{/usCountry}}ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి కూడా.. సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసిందని అడిగారు. ఆ విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసిందా? అని కూడా అనుబంధ ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.
{{/usCountry}}