...
...
Next Story

Komuravelli Railway Station : మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ - కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Komuravelli Railway Station : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల కోసం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఈనెల 26వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఆధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్ సిద్ధమైంది.

Published on: Jul 21, 2026, 05:12:45 IST
Advertisement

Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" ప్రారంభానికి ముహుర్తం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఈ రైల్వే స్టేషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది.

కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ఇటీవలనే 100 శాతం పనులు పూర్తి కావటంతో.... ఈనెల 26న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు :

  • సుందరమైన ప్రవేశ ద్వారంతో (పోర్టికో) కూడిన స్టేషన్ భవనాన్ని నిర్మించారు.
  • రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో భారీ హై-లెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు.
  • ఎండ, వానల నుంచి రక్షణ కోసం ప్లాట్‌ఫారమ్‌పై ఐదు అధునాతన షెల్టర్లను ఏర్పాటు చేశారు.
  • ప్రయాణికులు వేచి ఉండటానికి విశాలమైన వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు.
  • ప్లాట్‌ఫారమ్‌పై కూర్చోవడానికి వీలుగా త్రీ-సీటర్ బెంచీలను అమర్చారు.
  • టికెట్ల జారీ కోసం ఆధునిక బుకింగ్ కౌంటర్లను సిద్ధం చేశారు.
  • స్టేషన్ వెలుపల వాహనాల రాకపోకల కోసం విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, ప్రత్యేక పార్కింగ్ వసతులను కల్పించారు.
  • ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
  • మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగుల (దివ్యాంగజన్) కోసం ప్రత్యేకంగా ఆధునిక శౌచాలయాలను నిర్మించారు.
  • స్టేషన్‌కు చేరుకోవడానికి వీలుగా రోడ్లను చక్కగా అభివృద్ధి చేశారు.
  • స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టేషన్ భవన ముఖద్వారాన్ని (ఆర్కిటెక్చరల్ ఎలివేషన్) తీర్చిదిద్దారు.
  • కొమరవెల్లి మల్లన్న స్వామి వైభవాన్ని, స్థానిక అడవులు, జంతుజాలాన్ని (ఫ్లోరా అండ్ ఫౌనా) ప్రతిబింబించేలా గోడలపై అద్భుతమైన మురళీ చిత్రాలను (మ్యూరల్ పెయింటింగ్స్) వేయించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe