కేసీఆర్ అజేయుడు.. ఆయన పేరు వింటేనే ప్రత్యర్థులకు వణుకు.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్పై రాజకీయ దాడులు జరిగినప్పటికీ అజేయుడిగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ చేయడంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని దుష్ట శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత రాజకీయ ప్రత్యర్థుల చౌకబారు వ్యూహాలకు తలొగ్గరని నొక్కి చెప్పారు.

'తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు ఒత్తిడిని, కష్టాలను తట్టుకున్నారు. ఢిల్లీ ఒత్తిడికి ఆయన ఎప్పుడూ తలొగ్గలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయన దృఢంగా ఉన్నారు. కేసీఆర్ అజేయుడు. మూర్ఖులు చరిత్రను అర్థం చేసుకోలేరు, చరిత్ర సృష్టించడం కూడా చేయలేరు.' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ పేరు వింటేనే వణికిపోతారని, కానీ ఆయన పేరు చెప్పేంత స్థాయి కూడా వారికి లేదన్నారు కేటీఆర్.
హరిష్ రావు కామెంట్స్
కేసీఆర్పై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసులు నిజమైన దర్యాప్తులో భాగం కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతీకార దాడి అని అన్నారు. ప్రభుత్వం చౌకబారు రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించిందన్నారు. చట్టపరమైన విధానాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించారని పేర్కొ్న్నారు.
దశాబ్ద కాలం రాష్ట్రాన్ని నడిపించిన మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు. సిట్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యక్ష ఆదేశాల మేరకు పనిచేస్తుందని ఆరోపించారు.
ప్రజల అసంతృప్తి, నెరవేరని వాగ్దానాలు, మోసాల నుండి దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు, పెద్ద ఎత్తున సిబ్బందిని మోహరించడం వంటివి బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టలేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ భయం కనిపిస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నప్పటికీ.. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని హరీష్ రావు అన్నారు. భయపడే ప్రభుత్వాలు మాత్రమే ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటాయని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే మౌనంగా ఉండమని హెచ్చరించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


