...
...
Next Story

నిమ్స్‌లో లిక్విడ్ బయాప్సీ.. ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ కనిపెట్టేయెుచ్చు!

క్యా్న్సర్ చికిత్సలో నిమ్స్ ఆసుపత్రి మరో ముందడుగు వేస్తోంది. లిక్విడ్ బయాప్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

Published on: May 31, 2026, 15:39:57 IST
Advertisement

క్యాన్సర్ చికిత్స రంగంలో నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో భారీ అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను రోగులకు చేరువ చేస్తూ నిమ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (NGS) ఆధారంగా క్యాన్సర్‌ జీనోమిక్స్‌ సెంటర్‌ను విజయవంతంగా నడుపుతున్న నిమ్స్, త్వరలోనే కేవలం ఒకే ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ను గుర్తించే ‘లిక్విడ్ బయాప్సీ’ (Liquid Biopsy) సేవలను ప్రారంభించబోతోంది.

నిమ్స్‌లో లిక్విడ్ బయాప్సీ
నిమ్స్‌లో లిక్విడ్ బయాప్సీ

ఇప్పటికే క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక క్యాన్సర్ జెనోమిక్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. తెలంగాణ ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో 'నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్' (NGS) ఆధారిత క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందిస్తున్న మొట్టమొదటి సంస్థగా నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.

నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేది క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో అత్యంత అధునాతన సాంకేతికత. ఇది రోగి DNA, RNA లలో జరిగే జన్యుపరమైన మార్పులను అత్యంత కచ్చితత్వంతో విశ్లేషిస్తుంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

క్యాన్సర్ ఖచ్చితమైన లక్షణాలను తెలుసుకోవడం ద్వారా, రోగికి ఏ రకమైన కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ అవసరమో వైద్యులు సులభంగా నిర్ణయించగలరు. దీనివల్ల అనవసరపు మందుల వాడకం, దుష్ప్రభావాలు తగ్గుతాయి.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (DHR) - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంయుక్తంగా చేపట్టిన 'అడ్వాన్స్‌డ్ మాలిక్యులర్ ఆంకాలజీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్' (DIAMOnDS) ప్రాజెక్ట్‌లో భాగంగా నిమ్స్‌లో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశం అంతటా కేవలం 25 కేంద్రాలను మాత్రమే ఎంపిక చేయగా, దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రోగులకు సేవలందిస్తున్న ఏకైక కేంద్రంగా నిమ్స్ నిలిచింది అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. భీరప్ప తెలిపారు.

సాధారణంగా క్యాన్సర్ తీవ్రతను తెలుసుకోవడానికి శరీరంలోని కణితి నుండి ముక్కను సేకరించి (టిష్యూ బయాప్సీ) పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, త్వరలో రాబోయే ఈ 'లిక్విడ్ బయాప్సీ' విధానంలో ఎటువంటి కణజాలాన్ని సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ రక్త పరీక్ష ద్వారానే క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించవచ్చు.

శరీరంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే కణితుల నుండి ముక్కను సేకరించడం ప్రాణసంకటంగా మారుతుంది. ముఖ్యంగా: ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల్లోకి పాకిన (Metastatic) క్యాన్సర్లతో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన కేసులలో శరీరం లోపలికి వెళ్లి కణజాలాన్ని సేకరించడం (Biopsy) చాలా కష్టం. ఈ తరహా రోగులకు లిక్విడ్ బయాప్సీ ఒక అద్భుతమైన వరంగా మారబోతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe