క్యాన్సర్ చికిత్స రంగంలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో భారీ అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను రోగులకు చేరువ చేస్తూ నిమ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (NGS) ఆధారంగా క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్ను విజయవంతంగా నడుపుతున్న నిమ్స్, త్వరలోనే కేవలం ఒకే ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్ను గుర్తించే ‘లిక్విడ్ బయాప్సీ’ (Liquid Biopsy) సేవలను ప్రారంభించబోతోంది.

ఇప్పటికే క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక క్యాన్సర్ జెనోమిక్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. తెలంగాణ ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో 'నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్' (NGS) ఆధారిత క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందిస్తున్న మొట్టమొదటి సంస్థగా నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.
నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేది క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో అత్యంత అధునాతన సాంకేతికత. ఇది రోగి DNA, RNA లలో జరిగే జన్యుపరమైన మార్పులను అత్యంత కచ్చితత్వంతో విశ్లేషిస్తుంది. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
క్యాన్సర్ ఖచ్చితమైన లక్షణాలను తెలుసుకోవడం ద్వారా, రోగికి ఏ రకమైన కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ అవసరమో వైద్యులు సులభంగా నిర్ణయించగలరు. దీనివల్ల అనవసరపు మందుల వాడకం, దుష్ప్రభావాలు తగ్గుతాయి.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (DHR) - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంయుక్తంగా చేపట్టిన 'అడ్వాన్స్డ్ మాలిక్యులర్ ఆంకాలజీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్' (DIAMOnDS) ప్రాజెక్ట్లో భాగంగా నిమ్స్లో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశం అంతటా కేవలం 25 కేంద్రాలను మాత్రమే ఎంపిక చేయగా, దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రోగులకు సేవలందిస్తున్న ఏకైక కేంద్రంగా నిమ్స్ నిలిచింది అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. భీరప్ప తెలిపారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాలిక్యులర్, జెనెటిక్ పరీక్షలకు రూ. 20,000 నుండి రూ. 1,000,000 వరకు ఖర్చవుతుంది. నిమ్స్లో ఈ సేవలు ఉచితంగా, రాయితీ ధరలపై లభించడం వల్ల పేద, మధ్యతరగతి క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయింది.
{{/usCountry}}ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాలిక్యులర్, జెనెటిక్ పరీక్షలకు రూ. 20,000 నుండి రూ. 1,000,000 వరకు ఖర్చవుతుంది. నిమ్స్లో ఈ సేవలు ఉచితంగా, రాయితీ ధరలపై లభించడం వల్ల పేద, మధ్యతరగతి క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయింది.
{{/usCountry}}సాధారణంగా క్యాన్సర్ తీవ్రతను తెలుసుకోవడానికి శరీరంలోని కణితి నుండి ముక్కను సేకరించి (టిష్యూ బయాప్సీ) పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, త్వరలో రాబోయే ఈ 'లిక్విడ్ బయాప్సీ' విధానంలో ఎటువంటి కణజాలాన్ని సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ రక్త పరీక్ష ద్వారానే క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించవచ్చు.
శరీరంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే కణితుల నుండి ముక్కను సేకరించడం ప్రాణసంకటంగా మారుతుంది. ముఖ్యంగా: ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల్లోకి పాకిన (Metastatic) క్యాన్సర్లతో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన కేసులలో శరీరం లోపలికి వెళ్లి కణజాలాన్ని సేకరించడం (Biopsy) చాలా కష్టం. ఈ తరహా రోగులకు లిక్విడ్ బయాప్సీ ఒక అద్భుతమైన వరంగా మారబోతోంది.