ఎల్పీజీ కొరత భయం.. హైదరాబాద్లోని డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించేవారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు విజృంభిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రజలు గ్యాస్ గురించి భయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో సాధారణ సగటు కంటే 20,000 సిలిండర్లకు పైగా అదనంగా బుక్ అయ్యాయి. అయితే బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఏమాత్రం తగ్గడం లేదు. గృహ వినియోగదారులకు సిలిండర్ ధరలను మూడు రెట్లు పెంచి దాదాపు రూ. 3,000కు చేర్చారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకారం, ఈ ఏడాది ఇదే సమయం వరకు గృహాలకు సగటున 2,15,151 ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 2,35,678కి (మార్చి 17 వరకు నమోదైనది) పెరిగింది. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) 93,887 డెలివరీలు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) 84,156, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 57,635 డెలివరీలు చేశాయి.
మరోవైప్ ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు. ఒకవేళ గ్యాస్ కొరత ఉంటే.. ఇంత డిమాండ్ ఎలా తీర్చగలుగుతామంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్తో ఘర్షణ దిగాయి. ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో సమస్య మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతాన్ని నిర్వహించే ఈ జలమార్గం గుండా చమురు ట్యాంకర్లు వెళ్లకుండా ఇరాన్ అడ్డుకుంది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
చర్చల ద్వారా భారతదేశం చివరికి కొన్ని ట్యాంకర్లకు మార్గాన్ని కల్పించుకోగలిగినప్పటికీ.. ప్రజలు మాత్రం గ్యాస్ గురించి భయపడ్డారు. కొందరు ముందుగానే ఆలోచించి.. సేఫ్టీగా రెండు లేదా మూడు సిలిండర్లను కూడా కావాలని అనుకుంటున్నారు.
దీంతో ఏజెన్సీలు ఇదే అదునుగా భావించి బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచి అమ్ముతున్నాయి. మరోవైపు ఉగాది, రంజాన్ పండుగలను బ్లాక్ మార్కెట్లో కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. ఎల్పీజీ ధరలను అమాంతం పెంచారు. సాధారణంగా ప్రైవేట్ మార్గాల ద్వారా ఒక్కో సిలిండర్కు సుమారు రూ. 1,000–1,200 చెల్లించే గృహ వినియోగదారులు, ఇప్పుడు కేవలం క్యూలో నిలబడకుండా ఉండేందుకు రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు వెచ్చిస్తున్నారు.
{{/usCountry}}దీంతో ఏజెన్సీలు ఇదే అదునుగా భావించి బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచి అమ్ముతున్నాయి. మరోవైపు ఉగాది, రంజాన్ పండుగలను బ్లాక్ మార్కెట్లో కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. ఎల్పీజీ ధరలను అమాంతం పెంచారు. సాధారణంగా ప్రైవేట్ మార్గాల ద్వారా ఒక్కో సిలిండర్కు సుమారు రూ. 1,000–1,200 చెల్లించే గృహ వినియోగదారులు, ఇప్పుడు కేవలం క్యూలో నిలబడకుండా ఉండేందుకు రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు వెచ్చిస్తున్నారు.
{{/usCountry}}ఇక కమర్శియల్ సిలిండర్ కావాలి అనుకునేవారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత రెండు రోజుల్లోనే కొందరు ఒక్కో సిలిండర్కు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు వెచ్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కానీ ఎల్పీజీ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే స్పష్టం చేశాయి. సరిపడేంత నిల్వలు ఉన్నాయి. కానీ ప్రజలు భయంతో ఇంట్లో ఎల్పీజీ సిలిండర్లను స్టోర్ చేసుకునేందుకు చూస్తున్నారు. నిజానికి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.