...
...
Next Story

త్వరలో పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు పునఃప్రారంభం

పొద్దుతిరుగుడు పంట సాగు చేసిన రైతుల నుంచి పంటను ప్రభుత్వం సేకరించనుంది. కిందటి ఏడాదితో పోలీస్తే.. ఈ ఏడాది రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

Published on: May 15, 2026, 09:14:56 IST
Advertisement

తెలంగాణలో పొద్దుతిరుగుడు పంటను మార్క్‌ఫేడ్ ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల నుంచి పొద్దుతిరుగుడు పంట మొత్తాన్ని సేకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెంచిన పంట లక్ష్యాలకు ఆమోదం లభించిన తర్వాత కొనుగోళ్లు తిరిగి ప్రారంభమవుతాయని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మొహమాద్ హబీబ్ హామీ ఇచ్చారు. 2025-26 యాసంగి (రబీ) సీజన్ కోసం నిర్దేశించిన 2,39.330 మెట్రిక్ టన్నుల ప్రారంభ సేకరణ లక్ష్యాన్ని పూర్తిగా సాధించినట్లు తెలిపారు. సేకరించిన నిల్వలను మార్గదర్శకాలకు అనుగుణంగా నాఫెడ్, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.

పొద్దుతిరుగుడు పంట
పొద్దుతిరుగుడు పంట

సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అందించిన సమాచారం ప్రకారం.. 1,670.28 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేయగా, మొత్తం ఉత్పత్తి 1,169.196 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇది ప్రారంభ సేకరణ లక్ష్యాన్ని మించిపోయింది. పరిమితులు చేరుకోవడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలలో సేకరణను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.

అంచనా వేసిన ఉత్పత్తికి అనుగుణంగా సేకరణ లక్ష్యాన్ని పెంచడానికి, అలాగే రైతులకు క్వింటాల్‌కు రూ. 7,721 కనీస మద్దతు ధర అందేలా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హబీబ్ తెలిపారు. మొత్తం మిగులును సేకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సవరించిన పరిమితులకు ఆమోదం లభించే వరకు రైతులు ఓపికగా ఉండాలని హబీబ్ కోరారు.

సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో కేంద్రం ఇచ్చిన ప్రాథమిక లక్ష్యం పూర్తి కావడంతో మధ్యలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతుండటంతో, మార్క్‌ఫేడ్ అధికారులు స్పందించి అదనపు లక్ష్యం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

కేంద్ర ప్రభుత్వం 2025-26 సీజన్‌కు గాను పొద్దుతిరుగుడు గింజలకు క్వింటాలుకు రూ.7,721 మద్దతు ధరను నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రైతులకు గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe