హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
- మియాపూర్ - ఎల్బీ నగర్ కారిడార్లో సాధారణంగా పీక్ అవర్స్లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలుగా ఉంటుంది.
- నాగోల్-రాయదుర్గ్ కారిడార్లో సాధారణంగా నాన్-పీక్లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు ఉంటుంది.
- సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్లో 44 రైళ్లకు తగ్గించేవారు. సమ్మె కారణంగా ఇప్పుడు ఆ తగ్గింపు ఉండదు.
- ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు బుధవారం (ఏప్రిల్ 22, 2026) ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసుల్లో భారీ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడమే ఇందుకు కారణం. వేతన సవరణలో జాప్యం, ఇతర ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ, తమను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన విధంగా చూడాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.
కొన్ని రోజులు TGSRTC కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ ఆందోళన ప్రారంభానికి ముందుగానే సమ్మె నోటీసు జారీ చేశారు. మంగళవారం రాత్రి అధికారులతో జరిగిన చర్చలు విఫలమవడంతో, విధులను బహిష్కరించడమే తమకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయమని యూనియన్లు తెలిపాయి.
బస్సులు రోడ్ల పైకి రాకుండా ఆయా డిపోలకే పరిమితం కావడంతో, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు స్టాప్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారగా, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది. TGSRTC బస్సులు అందుబాటులో లేకపోవడంతో, ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, కేవలం రెండు మూడు సమస్యలు మాత్రమే పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయని తెలిపారు.
{{/usCountry}}రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, కేవలం రెండు మూడు సమస్యలు మాత్రమే పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయని తెలిపారు.
{{/usCountry}}