తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భవిష్యత్తు మరియు తదుపరి చర్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె విలేకరులతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు.

తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. తన బిడ్డ మాట్లాడితే తనకు ఎందుకు శిక్ష వేస్తారని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారని, నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దని కోరారు.
'మల్లికార్జున ఖర్గేను కలిశాను. నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను. నాపై చర్యలు తీసుకో కంటే ముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా అంటారు. పొంగులేటి, బట్టి భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. దానిపైన ఎందుకు మాట్లాడటం లేదు. చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు.' అని కొండా సురేఖ అన్నారు.
ఢిల్లీలో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలసి నట్లు సురేఖ తెలిపారు. 'పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇంకా చర్చలు జరగలేదు. ఇప్పటివరకు అధిష్ఠానం నన్ను రాజీనామా చేయమని చెప్పలేదు.' అని ఆమె వెల్లడించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పొలిటికల్ సమీకరణాలపై ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులందరికీ రాతపూర్వకంగా లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఖర్గేను కలిసిన సమయంలో కూడా ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్వయంగా కోరినట్లు ఆమె వివరించారు.
పార్టీలో సామాజిక న్యాయం అమలు తీరుపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుజన సామాజిక వర్గానికి చెందిన తనకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాల నాయకులకు మరొక న్యాయం పాటిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. 'రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఇతర వర్గాల నాయకత్వంపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటిపై అధిష్ఠానం ఏం సమాధానం చెబుతుంది? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?' అంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}పార్టీలో సామాజిక న్యాయం అమలు తీరుపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుజన సామాజిక వర్గానికి చెందిన తనకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాల నాయకులకు మరొక న్యాయం పాటిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. 'రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఇతర వర్గాల నాయకత్వంపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటిపై అధిష్ఠానం ఏం సమాధానం చెబుతుంది? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?' అంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ నేరుగా అధిష్ఠానం పెద్దల వద్దే కేబినెట్ పరిణామాలను ప్రస్తావించడం, సామాజిక న్యాయం కోణంలో ప్రశ్నలు గుప్పించడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీసీ గళం ఎత్తడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో, కొండా సురేఖ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది.