కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు తామే మెజార్టీ స్థానాలను గెలుచుకున్నామని చెబుతున్న బీజేపీ… మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వారికి వచ్చిన సీట్లే కాకుండా… మరో నలుగురిని పార్టీలోకి తీసుకోగా… కావాల్సిన మద్దతుని కూడగట్టుకున్నామని ఎంపీ బండి సంజయ్ కూడా ప్రకటించారు. అయితే బీజేపీకి బ్రేకులు వేసే దిశగా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది.
బీజేపీకి మెజార్టీ లేదు - మంత్రి పొన్నం

కరీంనగర్ మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో మాదిరిగానే కరీంనగర్ లో కూడా బీజేపీకి మెజారిటీ లేదన్నారు. 16వ తేదీన ఏం జరుగుతుందో చూద్దామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిజామాబాద్ మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ కి మెజారిటీ లేదని మంత్రి పొన్నం చెప్పారు. “నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు ఉన్నాయి.. 28 సీట్లతో బీజేపీ ఉంది.. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మెజారిటీ లేదని ప్రతిపక్షం లో కూర్చుంటామని అన్నారు. కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని గెలిచాయి. అక్కడ ఏమవుతుందని భవిషత్ నిర్ణయిస్తుంది. కరీంనగర్ లో మొత్తం 69 సభ్యులకు బీజేపీ కి 30 ఉన్నాయి. కానీ మేయర్ అవుతామని బండి సంజయ్ ప్రకటించుకున్నారు. బండి సంజయ్ మాదిరిగానే మిగతా పార్టీలకు కూడా వ్యూహాలు ఉంటాయి” అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
“రాజకీయ పార్టీ గా గతంలో మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్ లో మేయర్ అయ్యాం. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకు వ్యవహరిస్తాం. ముఖ్యమంత్రి మంత్రుల జోక్యం లేదు. స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తాం” అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
“డెమోక్రటిక్ గానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ను ఎన్నుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ,మంత్రులు ,ప్రజా ప్రతినిధులను తిరగనీయం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యం లో మేము ఎవరికి వ్యతిరేకం కాదు. బీజేపీలో గెలిచిన 30 మందికి శుభాకాంక్షలు.. మిగిలిన 36 మందికి శుభాకాంక్షలు. ఉత్తర తెలంగాణ లో కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆలోచన. మీకు మెజారిటీ ఉంటే మేము అడ్డుపడడం లేదు... మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరిని పదవి నుంచి దింపే ప్రయత్నం చేయడం లేదు” అని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు.
16వ తేదీన చూద్దాం….
{{/usCountry}}“డెమోక్రటిక్ గానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ను ఎన్నుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ,మంత్రులు ,ప్రజా ప్రతినిధులను తిరగనీయం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యం లో మేము ఎవరికి వ్యతిరేకం కాదు. బీజేపీలో గెలిచిన 30 మందికి శుభాకాంక్షలు.. మిగిలిన 36 మందికి శుభాకాంక్షలు. ఉత్తర తెలంగాణ లో కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆలోచన. మీకు మెజారిటీ ఉంటే మేము అడ్డుపడడం లేదు... మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరిని పదవి నుంచి దింపే ప్రయత్నం చేయడం లేదు” అని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు.
16వ తేదీన చూద్దాం….
{{/usCountry}}“మా పార్టీకి సంబంధించి సమన్వయం చేసుకున్నప్పుడు వారికి అనుగుణంగా వ్యవహరిస్తాం. రాజకీయంగా లబ్ధి పొందాలని మాకు ఆలోచన లేదు. కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి జిల్లా మంత్రిగా మేము సహకరిస్తాం. రాజకీయ పార్టీగా మేము మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నా. నిజామాబాద్ కాగానే కరీంనగర్ లో కుడా మెజారిటీ లేదు. మీరు (బీజేపీ) ఇండిపెండెడ్ లను కలుపుకోవడం అనైతికం కాదా..? ఆయా రాజకీయ పార్టీలకు పొత్తులు ఉంటాయి, 16వ తేదీ ఏమవుతుందో చూద్దాం” అంటూ మంత్రి పొన్నం మాట్లాడారు.