ఎండల తీవ్రత తగ్గి, చల్లని నైరుతి రుతుపవనాలు దేశాన్ని పలకరించే ఆహ్లాదకరమైన సమయం జూన్. ప్రకృతి పరంగా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, సగటు సామాన్యుడికి, అన్నదాతకు మాత్రం ఈ నెల ఆర్థిక భారాల కాలంగా మారుతోంది. "అమ్మో జూన్ నెల వచ్చింది" అంటూ మధ్యతరగతి తల్లిదండ్రులు, పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే రైతులు గుండెలు గుభేలుమనే పరిస్థితి నెలకొంది. చదువులు, సాగు పనులు ఒకేసారి ముంచుకురావడంతో జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిడిల్ క్లాస్ ఇళ్లలో స్కూలు ఫీజులు, రైతులైతే పెట్టుబడి ఖర్చుల గురించి ఆలోచనలు చేస్తున్నారు.
స్కూల్ ఫీజుల మోత

జూన్ నెల రాగానే తల్లిదండ్రులను పట్టి పీడించే ప్రధాన సమస్య స్కూల్ రీ-ఓపెనింగ్స్, అడ్మిషన్ల ఫీజులు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఏటా 10 శాతం నుండి 15 శాతం వరకు పెరుగుతూనే ఉంది. ఎల్కేజీ, యూకేజీ తరగతులకే ప్రైవేట్ స్కూళ్లలో కనీసం రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక హైస్కూల్ విద్యార్థులకైతే ఈ భారం రూ. 80,000 దాటుతోంది.
కేవలం ట్యూషన్ ఫీజుతోనే సరిపోదు. పుస్తకాలు, నోట్బుక్స్ కోసం రూ. 5,000, స్కూల్ యూనిఫాం, షూస్ కోసం మరో రూ. 4,000, వ్యాన్ లేదా బస్సు ఛార్జీల రూపంలో నెలకు రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది కేవలం సాధారణ పాఠశాలల్లోని ఫీజులు మాత్రమే. ఇక మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఈ ఫీజు డబుల్ అవుతుంది. ఇద్దరు పిల్లలున్న ఒక మధ్యతరగతి కుటుంబం జూన్ నెలలో కేవలం చదువుల కోసమే కనీసం రూ. 1,00,000 నుండి రూ. 1,500,00 వరకు సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది.
అన్నదాతల పెట్టుబడి ఆరాటం
మరోవైపు జూన్ మాసం రైతులకు సాగు కాలం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పుల వేటలో పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎకరా సాగు చేయాలంటే విత్తనాలు, దుక్కులు, కూలీల ఖర్చులు కలిపి ప్రాథమికంగానే రూ. 15,000 నుండి రూ. 20,000పైనే అవసరమవుతాయి. 5 ఎకరాలున్న రైతుకు జూన్ నెలలో కనీసం రూ. 80,000 నుండి లక్ష రూపాయలపైనే పెట్టుబడి అత్యవసరం. వీటికోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
{{/usCountry}}మరోవైపు జూన్ మాసం రైతులకు సాగు కాలం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పుల వేటలో పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎకరా సాగు చేయాలంటే విత్తనాలు, దుక్కులు, కూలీల ఖర్చులు కలిపి ప్రాథమికంగానే రూ. 15,000 నుండి రూ. 20,000పైనే అవసరమవుతాయి. 5 ఎకరాలున్న రైతుకు జూన్ నెలలో కనీసం రూ. 80,000 నుండి లక్ష రూపాయలపైనే పెట్టుబడి అత్యవసరం. వీటికోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
{{/usCountry}}మార్చి, ఏప్రిల్ నెలల నుంచే జూన్ ఖర్చుల కోసం కొంత సొమ్మును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. విద్యా రుణాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై కఠినమైన చట్టాలు తేవాలని, రైతులకు సకాలంలో పెట్టుబడి రాయితీలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.