ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు అంటే.. మావోయిస్టులకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. కీలక నేతలు ఇక్కడ తలదాచుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం బలగాల చేతుల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం కూడా దీనిని ఎకో టూరిజం హబ్గా మార్చాలని భావిస్తోంది. మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టుల ఉనికి తెలంగాణలో లేదన్నారు.

అపారమైన అటవీ సంపదతో, సుందరమైన సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కర్రెగుట్టల ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పర్యటించే పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో పామునూరు ప్రత్యేక పోలీస్ అవుట్పోస్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది.
పామునూరు ఆపరేటింగ్ బేస్ సమీపంలో ఇంటర్ ఏజెన్సీ కో-ఆర్డినేషన్ సెంటర్, పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణానికి పోలీసు అధికారులతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. మురుమూరు నుంచి పామునూరుకు, అక్కడి నుంచి తడపల అనే ప్రాంతానికి 13 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కూడా జరుగుతోంది.
కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు లేదని డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ఆదివాసీ సమాజానికి అండగా నిలుస్తూ, వారి సామాజిక, ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తాయని తెలిపారు.
కర్రెగుట్టలు ప్రాంతం వంటి కొండ ప్రాంతాలలో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ఆ ప్రాంతం మావోయిస్టు కార్యకలాపాల రహితంగా ఉండేలా చూసుకోవడానికి రాష్ట్ర పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య నిరంతర సమన్వయం అత్యవసరం అని డీజీపీ శివధర్ రెడ్డి నొక్కి చెప్పారు.
అంతేకాదు పామునూరు గుట్టల మీద నివసిస్తున్న ఏడు ఆదివాసీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతోపాటుగా రవాణా కోసం ఆటోలను, బైకులను కూడా పోలీస్ శాఖ పంపిణీ చేసింది. ఇక వారికి పట్టణాలకు, గ్రామానికి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.
{{/usCountry}}అంతేకాదు పామునూరు గుట్టల మీద నివసిస్తున్న ఏడు ఆదివాసీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతోపాటుగా రవాణా కోసం ఆటోలను, బైకులను కూడా పోలీస్ శాఖ పంపిణీ చేసింది. ఇక వారికి పట్టణాలకు, గ్రామానికి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.
{{/usCountry}}ఇక మెుత్తానికి తెలంగాణలో నక్సలిజం లేదని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కర్రెగుట్టలు ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తోంది. ఏదైనా ఏజెన్సీకి టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నైట్ స్టేలు, హోటళ్లులాంటివి కూడా రావొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి తరహాలో టూరిజం స్పాట్గా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.