Sammakka Sarakka Central Tribal University : ములుగు జిల్లాలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక 'సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం' (SSCTU) నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యా సంస్థల్లో ఒక్కటైనా ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం, అకాడమిక్ మద్దతుతో విశ్వవిద్యాలయం కీలక కోర్సులను ఆఫర్ చేస్తోంది. సీయూఈటీ యూజీ (CUET UG, జేఈఈ మెయిన్స్ (JEE Main) ప్రవేశ పరీక్షల ద్వారా సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రో. వై.ఎల్. శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
కోర్సుల వివరాలు….
2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 5 విభిన్నమైన నలుగు సంవత్సరాల యూజీ ప్రోగ్రామ్లలో మొత్తం 130 సీట్లను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి….
- బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : ఐఐటీ హైదరాబాద్ తో కలిసి అందిస్తున్న ఈ 4 ఏళ్ల కోర్సులో మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ : ఐఐటీ హైదరాబాద్ సహకారంతో అందించే ఈ కోర్సులో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఎస్సీ హానర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ : ఐఐటీ హైదరాబాద్ అకాడమిక్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ 4 ఏళ్ల కోర్సులో 25 సీట్లు కేటాయించారు.
- బీఏ హానర్స్ ఇంగ్లీష్ : 4 ఏళ్ల వ్యవధి గల ఈ కోర్సులో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీఏ హానర్స్ ఎకనామిక్స్ : 4 సంవత్సరాల వ్యవధి గల ఈ కోర్సులో 25 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా…
అర్హులైన విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ( https://ssctucuet.samarth.edu.in/ ) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన బీటెక్ అభ్యర్థులు రూ.500, బీఏ కోర్సుల అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు బీటెక్ కోర్సుకు రూ.250, బీఏ కోర్సులకు రూ.150 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఫీజు చెల్లించిన రశీదును పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఆగస్టు 3, 2026
- మెరిట్ జాబితా విడుదల: ఆగస్టు 5, 2026 కౌన్సెలింగ్
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 11, 2026.
అర్హులైన విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ( https://ssctucuet.samarth.edu.in/ ) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన బీటెక్ అభ్యర్థులు రూ.500, బీఏ కోర్సుల అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు బీటెక్ కోర్సుకు రూ.250, బీఏ కోర్సులకు రూ.150 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఫీజు చెల్లించిన రశీదును పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : ఆగస్టు 3, 2026
- మెరిట్ జాబితా విడుదల: ఆగస్టు 5, 2026 కౌన్సెలింగ్
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 11, 2026.