రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో ఆదివారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మేకల వేణుమాధవ్రెడ్డి సుపారీ గ్యాంగ్తో శ్రీనివాసులును హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లో కారుతో సహా పడేశాడు. హత్యకు దారితీసిన సంఘటనల క్రమాన్ని వివరించారు పోలీసులు. వారిద్దరూ పూర్వ విద్యార్థుల సమావేశంలో కలుసుకున్నారని, వారి కాంటాక్ట్ నంబర్లను మార్చుకున్నారని పోలీసులు తెలిపారు.

తార్నాక నివాసి అయిన బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉన్నాడు. జీఎస్టీలో నకిలీ ఇన్వాయిస్, అమ్మకాల పత్రాలను సమర్పించడం ద్వారా లాభాలు పొందవచ్చని కూకట్పల్లికి చెందిన మేకల వేణుమాధవ్ రెడ్డి అతనికి చెప్పాడు. శ్రీనివాసులు జీఎస్టీని వేణుమాధవ్ వాడుకున్నాడు. జీఎస్టీ లావాదేవీల్లో పెండింగ్లో ఉన్న డబ్బుల విషయమై ఇద్దరికి కొంతకాలంగా వివాదం నడుస్తోంది. లక్షల రూపాయల డబ్బును శ్రీనివాస్కు వేణుమాధవ్ రెడ్డి ఇవ్వాల్సి ఉండేది.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నందున ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేనని శ్రీనివాస్కు వేణుమాధవ్ రెడ్డి తెలియజేశాడు. మరోవైపు నకిలీ ఇన్వాయిస్ సమర్పించినందుకు లైసెన్స్ రద్దు గురించి తెలియజేస్తూ శ్రీనివాస్కు జీఎస్టీ నుండి నోటీసు అందింది.
రూ.30 లక్షలు చెల్లించడం గురించి శ్రీనివాసులు, వేణుమాధవ్ మధ్య వివాదం జరిగింది. శ్రీనివాసులు నుండి పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక వేణుమాధవ్ అతన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కె. కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హజీజ్, మహ్మద్ అమ్జత్ అలీ ఖాన్ సహాయం తీసుకున్నాడు. శ్రీనివాసులును చంపడానికి సుపారీగా రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు.
వారి పథకం ప్రకారం, ఆ మొత్తాన్ని విజయవాడలో చెల్లిస్తానని వేణుమాధవ్ రెడ్డి.. శ్రీనివాస్కు తెలియజేశాడు. కారులో విజయవాడకు వెళ్తుండగా నార్కెట్పల్లి దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో శ్రీనివాసులుపై ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని, కారును ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలోకి తోసేశారు.
{{/usCountry}}వారి పథకం ప్రకారం, ఆ మొత్తాన్ని విజయవాడలో చెల్లిస్తానని వేణుమాధవ్ రెడ్డి.. శ్రీనివాస్కు తెలియజేశాడు. కారులో విజయవాడకు వెళ్తుండగా నార్కెట్పల్లి దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో శ్రీనివాసులుపై ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని, కారును ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలోకి తోసేశారు.
{{/usCountry}}ఆ తర్వాత మత్స్యకారులు చూసి పోలీసులకు తెలియజేశారు. కారును బయటకు తీయగా వెనక సీట్లో శ్రీనివాస్ మృతదేహం దొరికింది. శ్రీనివాస్ మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి సోదరుడు అబ్బులయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.