తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు, పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభకు తెలియజేశారు. రూ. 58 కోట్ల విలువైన 485 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. వాటిని ఫిబ్రవరి నెలాఖరులోగా వివిధ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా తృతీయ స్థాయి ఆసుపత్రులలో అవసరమైన పరికరాలను ప్రభుత్వం అంచనా వేసిందని, వాటిని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చిలోపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేర్వేరు ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి రూ. 192 కోట్ల వ్యయంతో ఎనిమిది కొత్త ఎంఆర్ఐ యంత్రాలను కొనుగోలు చేయడానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు దామోదర రాజనరసింహ. అదే కాలానికి రూ.60 కోట్ల విలువైన ఎనిమిది సిటి స్కాన్ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
క్యాన్సర్ రోగుల చికిత్స కోసం రూ. 32 కోట్ల విలువైన అదనపు లీనియర్ యాక్సిలరేటర్ (LINAC) యంత్రం, రూ. 8 కోట్ల విలువైన బ్రాకీథెరపీ యంత్రాలను నిమ్స్ కోసం కొనుగోలు చేస్తున్నట్టుగా మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. 2025లో న్యూరోసర్జరీ విభాగంలో రూ. 18 కోట్ల విలువైన పరికరాలను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో 38,000 పడకలు ఉన్నాయని, ఈ ఆసుపత్రులలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి అన్నారు. ఆసుపత్రులపై ఉన్న ఒత్తిడిని బట్టి వివిధ ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 15 రకాల పరికరాలను గుర్తించిందన్నారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అనేక అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అత్యవసర ప్రతిస్పందన సమయాన్ని 16 నిమిషాల నుండి 11 నిమిషాలకు తగ్గించిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రతిస్పందన సమయాన్ని 10 నిమిషాల కంటే తక్కువకు తీసుకురావడానికి అదనపు అంబులెన్స్ల కొనుగోలు వంటి చర్యలు ప్రారంభించామన్నారు. అదే సమయంలో 90 శాతం కేసులకు జిల్లా స్థాయిలోనే చికిత్స అందేలా చూడటానికి ప్రభుత్వం రెఫరల్ వ్యవస్థను ప్రోత్సహిస్తోందన్నారు.
{{/usCountry}}గత రెండేళ్లలో ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అనేక అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అత్యవసర ప్రతిస్పందన సమయాన్ని 16 నిమిషాల నుండి 11 నిమిషాలకు తగ్గించిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రతిస్పందన సమయాన్ని 10 నిమిషాల కంటే తక్కువకు తీసుకురావడానికి అదనపు అంబులెన్స్ల కొనుగోలు వంటి చర్యలు ప్రారంభించామన్నారు. అదే సమయంలో 90 శాతం కేసులకు జిల్లా స్థాయిలోనే చికిత్స అందేలా చూడటానికి ప్రభుత్వం రెఫరల్ వ్యవస్థను ప్రోత్సహిస్తోందన్నారు.
{{/usCountry}}రెండు డయాలసిస్ కేంద్రాల మధ్య దూరం 25 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండేలా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ప్రస్తుతం పనిచేస్తున్న 105 కేంద్రాలకు అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మరో 73 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో 213 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో సహా 813 పోస్టుల మంజూరు కోసం ఆరోగ్య శాఖ.. ఆర్థిక శాఖ అనుమతి కోరిందని మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు.