నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. వేసవిలో ఐస్క్రీమ్ బండ్లు చాలా వరకు ఊర్లలోకి వస్తున్నాయి. దీనిద్వారా పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. ఇది గమనించిన పలు గ్రామాల ప్రజలు ఐస్క్రీమ్ విక్రయాలను నిషేధించాయి.

ఐస్క్రీమ్ బండ్లు గ్రామాల్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ నిజామాబాద్ జిల్లాలోని పలు పంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలను ఆమోదించాయి. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే విక్రేతలకు రూ.5,000 జరిమానా విధిస్తామని గ్రామాల్లో హెచ్చరిస్తూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. నిజానికి మెుదట కొన్ని గ్రామాల్లో ఈ ఉద్యమం మెుదలైంది. తర్వాత తర్వాత పలు మండలాలకు వ్యాపించింది.
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, మక్లూర్ మండలంలోని మందాపూర్, అలాగే డొంకేష్వర్ మండలంలోని గాదేపల్లి, అన్నారం, నుత్పల్లి, తొండకూర్ వంటి గ్రామాలు కూడా ఇటువంటి తీర్మానాలనే ఆమోదించాయి. నందిపేట, ఆర్మూర్, ముపకల్, వేల్పూర్ మండలాల్లోని పంచాయతీలు కూడా రహదారుల పక్కన ఐస్క్రీమ్ విక్రయాలను ఏకగ్రీవంగా నిషేధించాయి.
ఈ నిషేధాన్ని తెలియజేసే బోర్డులను గ్రామాల ప్రవేశ ద్వారాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. పిల్లల ఆరోగ్యం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోపుడు బండ్ల నుండి ఐస్క్రీమ్ తింటున్న పిల్లలు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఐస్క్రీమ్లలో కృత్రిమ రంగులు, రసాయనాలను వినియోగించడంపై ఆందోళన చెందుతున్నారు. ఇవి క్యాన్సర్తో సహా తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చని వారు పేర్కొన్నారు.
ఐస్ క్రీమ్ బండ్లను నిషేధించే తీర్మానాలను ఆమోదించడానికి ముందు గ్రామ సభలను నిర్వహించారు. ఈ ప్రక్రియలో గ్రామ అభివృద్ధి కమిటీలు, రియు యువజన సంఘాలు తమ మద్దతును అందించాయి.
{{/usCountry}}ఐస్ క్రీమ్ బండ్లను నిషేధించే తీర్మానాలను ఆమోదించడానికి ముందు గ్రామ సభలను నిర్వహించారు. ఈ ప్రక్రియలో గ్రామ అభివృద్ధి కమిటీలు, రియు యువజన సంఘాలు తమ మద్దతును అందించాయి.
{{/usCountry}}గ్రామస్తుల మద్దతుతో ఏప్రిల్ 2వ తేదీ నుండి గ్రామంలో ఐస్క్రీమ్ తోపుడు బండ్లను తాము నిషేధించామని సుదపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తెలిపింది. ఎవరైనా ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే, వారికి రూ.5,000 జరిమానా విధిస్తామని వెల్లడించింది.
ఈ ఐస్క్రీమ్ ఉత్పత్తులను తిన్న తర్వాత పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యపరమైన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఇటువంటి విక్రయాలను నిలిపివేయాలని పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.