వర్షాకాలంలో స్కూళ్ల వద్ద ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ శాఖ ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు నగరంలో పెండింగ్లో ఉన్న మున్సిపల్ పనులను వేగవంతం చేసేందుకు వారానికి ఒకరోజు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా విద్యాసంస్థలను కోరాలని పోలీసులు భావిస్తున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ త్వరలోనే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వారానికి ఒకరోజు (ముఖ్యంగా బుధ లేదా గురువారాల్లో) ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆయన కోరనున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే, రెండు నెలల్లో విద్యార్థులు 8 రోజులు ఇంటి నుంచే క్లాసులకు హాజరవుతారు. 'దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, సైబరాబాద్ మున్సిపల్ అధికారులు పౌర పనులను సజావుగా పూర్తి చేయడానికి వీలవుతుంది.' అని సీపీ తెలిపారు.
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్ జోన్లలో ట్రాఫిక్ రద్దీ మళ్లీ మొదలైంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పేరెంట్స్ వాహనాలు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఒకేసారి క్యాంపస్ల ముందుకు వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. చాలా స్కూళ్లలో విద్యార్థులను దించడానికి, ఎక్కించుకోవడానికి సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
సైబరాబాద్ పరిధిలో 250 కి పైగా పాఠశాలలను అత్యధిక ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలుగా గుర్తించారు. జీడిమెట్లలో అత్యధిక ట్రాఫిక్ ఒత్తిడి ఉన్న క్లస్టర్గా నిలిచింది. ఇక్కడ 116 స్కూళ్లు, 73,041 మంది విద్యార్థులు ఉన్నారు. బాలానగర్ 67 స్కూళ్లు, 46,523 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 30 స్కూళ్లకు సొంత రవాణా సదుపాయం లేదు. కూకట్పల్లిలో 40 స్కూళ్లు, 37,728 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 32,000 మందికి పైగా ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఇలా అనేక స్కూళ్లు ఉన్నాయి.
ఇప్పుడు స్కూళ్లు తెరిచాక కూడా ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ కష్టాలు మరింత చూస్తున్నారు. ఓ వైపు వర్షాలతో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
{{/usCountry}}ఇప్పుడు స్కూళ్లు తెరిచాక కూడా ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ కష్టాలు మరింత చూస్తున్నారు. ఓ వైపు వర్షాలతో కూడా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
{{/usCountry}}మరోవైపు మల్కాజ్గిరి వైపు చూస్తే.. హబ్సిగూడ-నాచారం కారిడార్, ఉప్పల్ ప్రాంతాల్లో స్కూల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. వాహనాలను నిలపడానికి ప్రత్యేక స్థలాలు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు చేరవేసేందుకు సొంత వాహనాల వాడకం విపరీతంగా పెరగడం వల్ల, సాధారణ రోడ్లపై ఒక్కసారిగా వేలాది వాహనాలు వచ్చి చేరుతూ ట్రాఫిక్ను స్తంభింపజేస్తున్నాయి.