తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్గా నిలిచింది. సోమవారం (జూన్ 8) ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.

ఈ ఉచిత ప్రయాణాల ద్వారా తెలంగాణలోని సామాన్య, మధ్యతరగతి మహిళలకు రవాణా ఖర్చుల రూపంలో దాదాపు రూ. 10,696 కోట్ల ఆర్థిక ఊరట లభించింది. మెుత్తం మహిళల ప్రయాణాలు లెక్క వేయగా.. 308 కోట్లకుపైగా ఉన్నాయి. మహిళలు తమ దైనందిన ప్రయాణాల కోసం ఖర్చు చేసే ఈ భారీ మొత్తాన్ని పొదుపు చేసుకోగలిగారు.
ఇప్పటికే కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, త్వరలోనే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మరియు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
ఇప్పటివరకు మహిళలు తమ ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే దీని స్థానంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆర్ఎఫ్ఐడి సాంకేతికతతో కూడిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్డుల ముద్రణ పూర్తి చేసి, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన మహిళలందరికీ ఈ మహాలక్ష్మి కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. బస్సు ఎక్కినప్పుడు కండక్టర్కు ఆధార్ కార్డ్ చూపించి, అడ్రస్ వెరిఫై చేసుకుని జీరో టికెట్ తీసుకునే సమయం ఆదా అవుతుంది.
బస్సుల్లో ఉండే సరికొత్త ఈబీఎం మిషన్లపై ఈ స్మార్ట్ కార్డును సింపుల్గా ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఏ రూట్లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్సులను సర్దుబాటు చేయడం సులువవుతుంది.
{{/usCountry}}బస్సుల్లో ఉండే సరికొత్త ఈబీఎం మిషన్లపై ఈ స్మార్ట్ కార్డును సింపుల్గా ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఏ రూట్లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్సులను సర్దుబాటు చేయడం సులువవుతుంది.
{{/usCountry}}ఈ స్మార్ట్ కార్డును పొందడానికి మహిళలు కొన్ని వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ నకలు (ఆధార్లో తెలంగాణ అడ్రస్ ఉండాలి). ప్రజా పాలన దరఖాస్తు రశీదు లేదా రేషన్ కార్డ్ (ఆప్షనల్). పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు భారీగా రవాణా ఖర్చులు పొదుపు అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే స్మార్ట్ కార్డుల ద్వారా ఈ డిజిటల్ ప్రయాణం మహిళలకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.