రంగారెడ్డి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. ఓ కేసులో ఉన్న వ్యక్తి ఉన్మాదానికి రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు అమాయకులు బలైపోయారు. గతంలో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సదరు కేసులోని బాధిత మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను, ఆపై తన సొంత భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
కక్షతో దారుణం….

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవలగూడ గ్రామానికి చెందిన రాజు కుమార్ (35) అనే వ్యక్తిపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతడు… ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. నాటి నుంచి సదరు బాధిత కుటుంబంపై కక్ష పెంచుకున్న రాజు కుమార్…. శుక్రవారం రాత్రి షాబాద్లో నివసిస్తున్న బాలిక ఇంటిపై దాడికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికను… కారులో తీసుకెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మ వారించినప్పటికీ బలవంతంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేశాడు. తిరిగొచ్చి బాలిక అమ్మమ్మ, నాయనమ్మలను అతి కిరాతకంగా చంపేశాడు.
అక్కడితో నిందితుడి ఉన్మాదం చల్లారలేదు. ఈ దారుణం ముగిసిన వెంటనే తన ఇంటికి వెళ్లిన రాజు కుమార్.. అక్కడ తన భార్యను, ఇద్దరు అమాయక పిల్లలను కూడా దారుణంగా హతమార్చాడు. ఇలా రెండు కుటుంబాలను పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాత అతడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. "రెండు కుటుంబాల కథ ముగించేశాను.. ఇక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను," అని ఫోన్ లో చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. భయాందోళనకు గురైన నిందితుడి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. "పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న 35 ఏళ్ల రాజు కుమార్ అనే వ్యక్తి నిన్న రాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. నిందితుడి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో మేం దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించాం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం," అని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కిరాతక ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
{{/usCountry}}సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. "పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న 35 ఏళ్ల రాజు కుమార్ అనే వ్యక్తి నిన్న రాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. నిందితుడి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో మేం దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించాం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం," అని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కిరాతక ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
{{/usCountry}}