హన్మకొండలో 300 వీధి కుక్కలను చంపిన ఘటన.. 9 మందిపై కేసు నమోదు

హన్మకొండ జిల్లాలో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Published on: Jan 11, 2026, 22:19:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హన్మకొండ జిల్లాలో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 9న జంతు సంక్షేమ కార్యకర్తలు అదులాపురం గౌతమ్, ఫర్జానా బేగం దాఖలు చేసిన ఫిర్యాదులో జనవరి 6 నుండి మూడు రోజుల్లో శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో 300 వీధి కుక్కలు చంపినట్టుగా వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు.. వ్యక్తులను నియమించుకుని కుక్కలకు విషం ఇచ్చి చంపి తర్వాత శాయంపేట, ఆరెపల్లి గ్రామాల శివార్లలో పాతిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధికుక్కల ప్రాణాలను బలితీసుకున్నారు. ఇప్పటికే 120కిపైగా పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసులు, వెటర్నరీ సిబ్బంది వెలికితీశారు.

మరోవైపు వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. మెుత్తం 9 మందిపై కేసులు నమోదు అయ్యాయి. కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని, ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండటం కారణంగానే వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున కుక్కల మరణాల నివేదికలను ధృవీకరించడానికి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన జంతు సంక్షేమ కార్యకర్తలు ఫర్జానా బేగం, అదులపురం గౌతమ్ గ్రామాలను సందర్శించిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు విష ఇంజెక్షన్లను ఉపయోగించి వీధి కుక్కలను చంపారు. స్థానిక అధికారులకు తెలిసే వీధి కుక్కలను చంపారు.

ఈ సంఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త గౌతమ్ మాట్లాడుతూ, విచ్చలవిడిగా జంతువులను సామూహికంగా చంపడం చట్టవిరుద్ధం అన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నియమాలు, 2023ని కఠినంగా అమలు చేయడమే ఏకైక శాస్త్రీయ మరియు మానవీయ పరిష్కారం అని ఆయన నొక్కి చెప్పారు. స్థానిక సంస్థల వైఫల్యమే ఈ విషాదానికి కారణమని ఆరోపించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More