ఇంటర్ విద్యార్థులు సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఎదుర్కోవలసి ఉండేది. కానీ వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్లో కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పలు సంస్కరణలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ , ప్రాక్టికల్స్, ఇంటర్నల్ మార్కులు వంటి కీలక అంశాల్లో మార్పులు జరగనున్నాయి.

కొన్ని రోజుల కిందట ఈ అంశంపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. మార్పులపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం రాత పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 శాతం మార్కులు ఇంటర్నల్ పరీక్షలకు ఇస్తారు. ఇప్పుడు ఆంగ్లానికి మాత్రమే ఈ పరీక్షలు ఉన్నాయి. ఇక మీదట సంస్కృతం, తెలుగు, గణితం ఇలా తదితర సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయన్నమాట.
ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ వారికి ప్రయోగ పరీక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మీదట ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కులనే రెండు సంవత్సరాలకు సమానంగా కేటాయింపు చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూపులో ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 మార్కులు, సెకండర్ ఇయర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బైపీసీ గ్రూపులో ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వాటిని ఇక మీదట సగం చేస్తారు.
గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సిలబస్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్దేశించిన దాని కంటే ఇక్కడ సిలబస్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్సీఈఆర్టీతో సమానంగా ఇకపై సిలబస్ను ఉండనుంది. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించి.. దాన్ని స్కాన్ చేస్తే.. మరిన్ని వివరాలు వచ్చేలా చేస్తారు.
{{/usCountry}}గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సిలబస్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్దేశించిన దాని కంటే ఇక్కడ సిలబస్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్సీఈఆర్టీతో సమానంగా ఇకపై సిలబస్ను ఉండనుంది. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించి.. దాన్ని స్కాన్ చేస్తే.. మరిన్ని వివరాలు వచ్చేలా చేస్తారు.
{{/usCountry}}ఇప్పటి వరకు సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్నాయి. ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అకౌంటెన్సీ సబ్జెక్టుకు పెరుగుతున్న ఆదరణ కారణంగా కొత్త గ్రూపును తీసుకురానున్నారు. ఏసీఈ గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.