స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. ఈ తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్

మరో 10 విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది.

Published on: Aug 11, 2026, 22:11:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మరో 10 స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది.

స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల
స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన మరో 500 పోస్టుల భర్తీ ప్రక్రియను ఇటీవలే బోర్డు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకు 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది.

తాజాగా ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులను బోర్డు విడుదల చేసింది.

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా నోటిఫై చేసిన ఖాళీలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో పేర్కొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆగస్టు 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగల్‌రావునగర్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఏదైనా కారణంతో నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు, అలాగే పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అభ్యర్థుల కోసం ఆగస్టు 17వ తేదీని రిజర్వ్ డేగా నిర్ణయించారు.

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని బోర్డు సూచించింది. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించిన ఎస్‌ఎస్‌సీ లేదా ఈక్వల్ సర్టిఫికెట్, కమ్యూనిటీ/కుల ధ్రువీకరణ పత్రం తదితర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు పూర్తి వివరాలను MHSRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 1,616 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టగా, ఇప్పటికే 1,192 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ లింక్ క్లిక్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూడండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More