బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు అయ్యారు. బలమైన క్రీడా వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు్న్నారన్నారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు కావడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పారు. స్పోర్ట్స్ విషయంలో తన వంతుగా సాయం ఉంటుందన్నారు. అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్ వంటి ఇతర క్రీడా దిగ్గజాలతో కలిసి సింధు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొన్నారు.
ఇందిరమ్మ చీరలో మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వద్ద ఇందిరమ్మ చీరలో కనిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇందిరమ్మ చీరలను అందిస్తోంది. నవంబర్ 19న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు దశల్లో మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం
ఈ సమ్మిట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ ఎకానమీ చరిత్రలో లేని అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని భట్టి చెప్పారు. తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టుగా వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్య్ం కోసం మూలధనం, ఉత్పాదకత పెంపు అంశపై సెషన్ నిర్వహించారు. ఇందులో భట్టి విక్రమార్కతోపాటుగా విజన్ డాక్యుమెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ ప్రసన్న క్రాంతి, ఐఎస్బీ ఫ్యాకల్టీ ఆదిత్య, పారిశ్రామికవేత్త పరుశురాం, ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
'తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మాత్రమే కాదు, భవిష్యత్ కోసం మేం చేస్తున్న ప్రతిజ్ఞ. తెలంగాణ ఎకానమీ 3 ట్రిలియన్ డాలర్లు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. దేశ ఎకానమీ చరిత్రలో లేని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం.' అని భట్టి విక్రమార్క చెప్పారు.
టూరిజం పాత్ర కీలకం
దేశంలో తెలంగాణకు మంచి చారిత్రక వారసత్వ సంపద ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సమ్మిట్లో నిర్వహించిన తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజం సెషన్లో మంత్రి కొండా సురేఖతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదిగేందుకు టూరిజం పాత్ర చాలా కీలకమని చెప్పారు. ఇటీవల తీసుకొచ్చిన టూరిజం పాలసీ 2025-30 ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.
{{/usCountry}}దేశంలో తెలంగాణకు మంచి చారిత్రక వారసత్వ సంపద ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సమ్మిట్లో నిర్వహించిన తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజం సెషన్లో మంత్రి కొండా సురేఖతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదిగేందుకు టూరిజం పాత్ర చాలా కీలకమని చెప్పారు. ఇటీవల తీసుకొచ్చిన టూరిజం పాలసీ 2025-30 ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.
{{/usCountry}}'ఎకో టూరిజం నూతన అధ్యాయంగా నిలుస్తుంది. రాష్ట్ర విస్తీర్ణంలో 19 శాతం అడవులు ఉన్నాయి. ఈ నేలపై ఉన్న దేవాలయాలు కూడా మరింత అభివృద్ధికి నోచుకోవాలి. టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి పని చేస్తున్నాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య 36కు పెరగడం హర్షణీయం. దేవాలయాల పరిరక్షణ కేవలం పరిపాలన అంశం మాత్రమే కాదు. జీవ వైవిద్య, ప్రజల సంస్కృతిని పరిరక్షించడం.' అని మంత్రి కొండా సురేఖ చెప్పారు.