Telangana Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 కిలోమీటర్ల నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాలను వడగాల్పులు ముంచెత్తనున్నాయి. ఒకేసారి వడగాల్పులు, వర్షాల హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం..ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అంతేకాకుండా కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే సూచనలున్నాయి.
రేపు(మే 22) ఉదయం 8.30 గంటల తర్వాత నుంచి కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మే 23వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన ఉండదు. పలు జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులుంటాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}మే 23వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన ఉండదు. పలు జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులుంటాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.
{{/usCountry}}