సమాజాన్ని నివ్వెరపరిచే అత్యంత అమానుషమైన, గుండెల్ని పిండేసే విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలగూడ గ్రామంలో జరిగింది. ఒకే ఒక్క ఉన్మాద ఆలోచన.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. తన భార్య, ఇద్దరు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురిని కిరాతకంగా హతమార్చాడు పి.రాజ్కుమార్ అనే వ్యక్తి. ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందు.. తన ఇద్దరు కొడుకులను హెయిర్కట్ కోసం బయటకు తీసుకెళ్లాడు. చంపడానికి కొన్ని గంటల ముందు కుమారులతో ఎంతో సరదాగా క్రికెట్ ఆడాడని స్థానికులు చెబుతూ.. కన్నీరుమున్నీరవుతున్నారు.

మే నెలలో 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించినందుకు గాను రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ కేసు పెట్టిన కుటుంబంపై పగ పెంచుకున్నాడు. జూలై 10 (శుక్రవారం) రాత్రి 11 గంటల ప్రాంతంలో దైవలగూడ గ్రామంలోని సదరు బాలిక ఇంటిపై రాజ్కుమార్ దాడి చేశాడు. మొదట ఇంట్లోకి చొరబడి బాలిక తల్లిని, అమ్మమ్మను అత్యంత దారుణంగా చంపేశాడు. మైనర్ బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు వద్దకు తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత గొంతు కోసి చంపేశాడు.
ఆ ముగ్గురిని అంతం చేసిన రాజ్కుమార్ కారు నడుపుకుంటూ తిరిగి తన ఇంటికి వచ్చాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య పార్వతి సరిత, వారి ఇద్దరు కొడుకులను (మూడేళ్లు, రెండేళ్ల వయసు) దారుణంగా చంపేశాడు. రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట మధ్య.. ఆరు హత్యలు చేశాడు రాజ్ కుమార్. తన తండ్రికి చేసిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఆరు మందిని చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అని చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.
రాజ్కుమార్ (35), సరితది 2018లో ప్రేమ వివాహం. వేర్వేరు కులాలైనప్పటికీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సరిత బీఈడీ పూర్తి చేసింది. ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కూడా అర్హత సాధించింది. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంది. రాజ్కుమార్ కూడా ఇటీవలే మూడు ఎకరాల భూమిని ఎకరా రూ.1.3 కోట్ల చొప్పున విక్రయించాడు. డైరీ ఫామ్ ఏర్పాటు చేయడానికి షెడ్లు కూడా నిర్మించాడు. అంతా బాగుందనుకునే సమయంలో 2024 నుండి సదరు మైనర్ బాలికపై రాజ్కుమార్ కన్నుపడింది. దీంతో భార్య సరితను విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడం మెుదలుపెట్టాడు.
{{/usCountry}}రాజ్కుమార్ (35), సరితది 2018లో ప్రేమ వివాహం. వేర్వేరు కులాలైనప్పటికీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సరిత బీఈడీ పూర్తి చేసింది. ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కూడా అర్హత సాధించింది. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంది. రాజ్కుమార్ కూడా ఇటీవలే మూడు ఎకరాల భూమిని ఎకరా రూ.1.3 కోట్ల చొప్పున విక్రయించాడు. డైరీ ఫామ్ ఏర్పాటు చేయడానికి షెడ్లు కూడా నిర్మించాడు. అంతా బాగుందనుకునే సమయంలో 2024 నుండి సదరు మైనర్ బాలికపై రాజ్కుమార్ కన్నుపడింది. దీంతో భార్య సరితను విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడం మెుదలుపెట్టాడు.
{{/usCountry}}ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం.. రాజ్కుమార్ గత ఏడాది కాలంగా ఆ బాలికను తీవ్రంగా వేధిస్తున్నాడు. కాలేజీకి వెళ్తుంటే అడ్డుపడటం, ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగేవాడు. భయపడిన బాలిక తల్లి తన కూతురిని ఆరు నెలల పాటు కాలేజీకి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచింది. వారి కదలికలను గమనించడానికి రాజ్కుమార్ తన ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చాడు. మే 16న బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి కాలేజీ బయటకు రాగానే రాజ్కుమార్ ఆమె చేయి పట్టి లాగడానికి ప్రయత్నించాడు. తల్లి కాపాడుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. చివరకు ఆ కేసు పగగా మారింది. ఒకే రాత్రి ఆరు ప్రాణాలను బలితీసుకున్నది.