తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నమోదు చేసుకున్న మత్స్యకారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.

వేట సమయంలో జలవనరుల వద్ద ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. 18 నుండి 70 ఏళ్ల వయస్సు గల దాదాపు 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు ఈ బీమా రక్షణ వర్తిస్తుంది. జూన్ 1 నుంచే ఈ పాలసీ వ్యవధి ప్రారంభమైందని, అర్హులైన ప్రతి మత్స్యకారుడికీ బీమా కవరేజ్ అందుతుందని తెలిపారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే.. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల అందిస్తారు. పూర్తి శాశ్వత వైకల్యం: రూ. 5 లక్షల పరిహారం, పాక్షిక వైకల్యం: రూ. 2.5 లక్షల పరిహారం, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే రూ. 25,000 వరకు వైద్య సాయం అందిస్తారు.
ఈ పథకానికి అయ్యే ప్రీమియం భారాన్ని మత్స్యకారులపై వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఒక లబ్ధిదారునికి వార్షిక ప్రీమియం రూ. 79.96 కాగా, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి. రాష్ట్ర వాటాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 21.34 కోట్లు కేటాయించింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీ వాహనాల అందజేత, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా మత్స్యకార కుటుంబాల ఆర్థిక ముఖచిత్రం మారింది. ప్రమాదాలకు గురైన వేళ క్లెయిమ్లను వేగంగా పరిష్కరించేలా జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు మత్స్యశాఖ వర్గాలు తెలిపాయి.
{{/usCountry}}తెలంగాణ ఏర్పాటు తర్వాత చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీ వాహనాల అందజేత, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా మత్స్యకార కుటుంబాల ఆర్థిక ముఖచిత్రం మారింది. ప్రమాదాలకు గురైన వేళ క్లెయిమ్లను వేగంగా పరిష్కరించేలా జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు మత్స్యశాఖ వర్గాలు తెలిపాయి.
{{/usCountry}}ప్రమాదకర పరిస్థితుల్లో నీటి వనరుల వద్ద వృత్తిని కొనసాగించే మత్స్యకారులకు ప్రమాద బీమా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. బాధితుల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.