తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, నాయకుల బహిరంగ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర విచారణ పూర్తి చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తయారు చేసిన తుది నివేదికను కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్కు అందజేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మహేష్కుమార్ గౌడ్తో సమావేశమైన కమిటీ నాయకులు ఈ నివేదిక ప్రతిని అందజేశారు.

పార్టీ నిబంధనలను, హద్దులను దాటి మాట్లాడిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సురేఖ వెంటనే ఖండించాల్సిందని కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా సురేఖ పార్టీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మూడోసారి అని, ఇకపై కూడా ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.
సీనియర్ నాయకుడిగా, గతంలో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ హోదాలో ఉన్న ఆయనను కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
నివేదికను అందజేసిన అనంతరం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి సమర్పించిన రాతపూర్వక వివరణ లేఖలను, మీడియా కథనాలను, గతంలో జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నివేదికను సిద్ధం చేశామని తెలిపారు.
'కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. పార్టీ గౌరవ ప్రతిష్టలు కాపాడినప్పుడే రాబోయే రోజుల్లో సుస్థిరమైన పాలన అందించగలం. పార్టీకి నష్టం కలిగించేలా, అంతర్గత విషయాలను రచ్చకెక్కించేలా ఎవరూ మాట్లాడవద్దు. ఈ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కూడా పంపుతున్నాం. అధిష్ఠానం ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికే ఈ చర్యలు అవసరమని భావిస్తున్నాం.' అని మల్లు రవి స్పష్టం చేశారు.
{{/usCountry}}'కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. పార్టీ గౌరవ ప్రతిష్టలు కాపాడినప్పుడే రాబోయే రోజుల్లో సుస్థిరమైన పాలన అందించగలం. పార్టీకి నష్టం కలిగించేలా, అంతర్గత విషయాలను రచ్చకెక్కించేలా ఎవరూ మాట్లాడవద్దు. ఈ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలతో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కూడా పంపుతున్నాం. అధిష్ఠానం ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికే ఈ చర్యలు అవసరమని భావిస్తున్నాం.' అని మల్లు రవి స్పష్టం చేశారు.
{{/usCountry}}అయితే, ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని, ఇది కేవలం పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో పీసీసీ అధ్యక్షుడికే సమర్పించామని మల్లు రవి తెలిపారు. నివేదికలోని అంశాలపై అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సమగ్ర నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.