రైల్వే ప్రయాణికులకు అలర్ట్.... మిర్యాలగూడ – కాచిగూడ ప్యాసింజర్ టైమింగ్స్ మార్పు! ఇవిగో వివరాలు
మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ (రైలు నంబర్ 67776) సమయాలను దక్షిణ మధ్య రైల్వే సవరించింది. జూలై 10, 2026 నుండి ఈ కొత్త వేళలు అమలులోకి రానున్నాయి.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారం అందించింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు ప్రయాణించే ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పులు జరిగాయి. మిర్యాలగూడ–కాచిగూడ (రైలు నంబర్ 67776)ప్యాసింజర్ కొత్త వేళలు జూలై 10, 2026 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

నిర్వహణ పరమైన కారణాల వల్ల కొన్ని రైళ్లను మల్కాజ్గిరి రూట్కు బదులుగా చర్లపల్లి - మౌలా అలీ - లల్లాగూడ - సీతాఫల్మండి మీదుగా మళ్లించడమే ఈ సమయాల మార్పునకు ప్రధాన కారణం. మిర్యాలగూడ - నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్న మిగిలిన స్టేషన్లలో రైలు సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
పాత, కొత్త సమయాల పూర్తి వివరాలు:
- మిర్యాలగూడ : ఈ స్టేషన్ నుండి రైలు బయలుదేరే పాత సమయం, కొత్త సమయం ఒకటే. ఉదయం 05:35 గంటలకు రైలు ఇక్కడి నుండి కదులుతుంది.
- బీబీనగర్ : పాత సమయం ఉదయం 07:59/08:00 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 07:54కు చేరుకుని 07:55కు బయలుదేరుతుంది.
- ఘట్కేసర్ : పాత సమయం ఉదయం 08:09/08:10 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:05కు చేరుకుని 08:06కు బయలుదేరుతుంది.
- చర్లపల్లి : పాత సమయం ఉదయం 08:19/08:20 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:15కు చేరుకుని 08:16కు బయలుదేరుతుంది.
- మల్కాజ్గిరి : పాత సమయం ఉదయం 09:44/09:45 కాగా….. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:39కు చేరుకుని 08:40కు బయలుదేరుతుంది.
- సీతాఫల్మండి : పాత సమయం ఉదయం 09:54/09:55 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:54కు చేరుకుని 08:55కు బయలుదేరుతుంది.
- ఆర్ట్స్ కాలేజ్ : పాత సమయం ఉదయం 09:56/09:57 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:57కు చేరుకుని 08:58కు బయలుదేరుతుంది.
- జామై ఉస్మానియా : పాత సమయం ఉదయం 09:58/09:59 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 09:00కు చేరుకుని 09:01కు బయలుదేరుతుంది.
- విద్యానగర్ : పాత సమయం ఉదయం 10:00/10:01 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 09:04కు చేరుకుని 09:05కు బయలుదేరుతుంది.
- కాచిగూడ : ఈ రైలు చివరి స్టేషన్ అయిన కాచిగూడకు పాత సమయం ప్రకారమే ఉదయం 10:20 గంటలకు చేరుకుంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.
మల్కాజ్గిరి నుంచి విద్యానగర్ మధ్య ఉన్న స్టేషన్లలో రైలు నిమిషాల వ్యవధి ముందే రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త సమయ పట్టికను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

