రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ - యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది.
మారిన టైమింగ్స్….

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం…గతంలో ఉన్న టైమింగ్ ప్రకారం... యశ్వంతపూర్ - కాచిగూడ (ట్రైన్ నెంబర్ 20704) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03.48 నిమిషాలకు హిందూపూర్ చేరుకునేది. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 3.44 నిమిషాలకు యశ్వంతపూర్ నుంచి మధ్యాహ్నం 03.55 నిమిషాలకు చేరుకుని... మధ్యాహ్నం 03. 57 నిమిషాలకు బయల్దేరుతుంది.
ఇక కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.8 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని... 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కాచిగూడ-యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వారంలో 6 రోజులు రాకపోకలు సాగిస్తుంది. బుధవారం ఒక్క రోజు ఉండదు. ఈ ట్రైన్ మహబూబ్నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.