New Telangana CS Sanjay Jaju : తెలంగాణ రాష్ట్ర పరిపాలనారంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో…. ఆయన స్థానంలో సంజయ్ జాజును ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

సంజయ్ జాజు 1992 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇప్పటివరకు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ … ఆయనను తిరిగి సొంత కేడర్కు పంపేందుకు తక్షణమే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సబ్కలెక్టర్గా, పశ్చిమగోదావరి కలెక్టర్గా పని చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, కమిషనర్గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు.
ఈనెలతో ముగియనున్న గడువు…
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పొడిగించిన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి సీఎస్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రామకృష్ణారావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో, పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా అనుభవజ్ఞుడైన సంజయ్ జాజును రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు. సంజయ్జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.
{{/usCountry}}సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు. సంజయ్జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.
{{/usCountry}}