...
...
Next Story

Special Trains : తెలంగాణ, ఆంధ్ర మీదుగా సుబేదార్‌గంజ్-యశ్వంతపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్

Special Trains : ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సుబేదార్‌గంజ్ – యశ్వంతపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్తాయి.

Published on: Sep 3, 2026, 13:47:00 IST
Advertisement

రాబోయే పండగల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ (ప్రయాగ్‌రాజ్ సమీపంలో), బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సమయంలో రద్దీని తగ్గించడానికి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

సుబేదార్‌గంజ్-యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్
సుబేదార్‌గంజ్-యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్

04135 సుబేదార్‌గంజ్ – యశ్వంతపూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది. 11.09.2026 నుండి 04.12.2026 మధ్య 13 సర్వీసులు ఉంటాయి.

04136 యశ్వంతపూర్ – సుబేదార్‌గంజ్ నడుమ ప్రతి సోమవారం ఉంటుంది. 14.09.2026 నుండి 07.12.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, కృష్ణ, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ యాద్గిర్, రాయచూర్, యలహంక, శంకర్‌గఢ్, దభౌరా, మాణిక్‌పూర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బలార్షాలో ఆగుతుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను అందుబాటులో ఉంచారు. పండగల రద్దీ దృష్ట్యా ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో చేసుకోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

హైదరాబాద్ – మంగళూరు స్పెషల్ ట్రైన్స్

మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 12 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

07098మంగళూరు – హైదరాబాద్ నడుమ ప్రతీ గురువారం 10.09.2026 నుండి 26.11.2026 తేదీ దాకా 12 సర్వీసులు ఉంటాయి.

ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్టాపేజీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్. యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వటకర, తలస్సేరి, కణ్ణూర్, పయ్యన్నూర్, కాన్హంగాడ్, కాసరగోడ్‌లో ఆగుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe