Cherlapally - Kollam Special Trains : పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
రైళ్ల రాకపోకల షెడ్యూల్:
- చర్లపల్లి - కొల్లం ప్రత్యేక రైలు (నెం.07195): ఈ రైలు ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది (మొత్తం 4 సర్వీసులు).
- కొల్లం - చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07196): ఈ తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 15, 22, 29 మరియు సెప్టెంబరు 5 తేదీల్లో కొల్లం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).

{{^htLoading}} {{/htLoading}}
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
- తమిళనాడు: కాట్పాడి, జోలార్పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్.
- కేరళ: పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగప్పలి.
రద్దీ ఎక్కువగా ఉండే ఈ సీజన్లో ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}