పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలోని వరంగల్, ఏపీలోని విజయవాడ మార్గం గుండా ప్రయాణిస్తాయి.

కాన్పూర్ సెంట్రల్ – మధురై ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01925) ప్రతి బుధవారం ఉదయం 08:10 గంటలకు కాన్పూర్ సెంట్రల్లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది. 02 సెప్టెంబర్ 2026 నుండి 25 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
మధురై – కాన్పూర్ సెంట్రల్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01926) ప్రతి శనివారం అర్ధరాత్రి దాటాక 02:30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. 05 సెప్టెంబర్ 2026 నుండి 28 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో అనేక కీలక స్టేషన్లలో ఆగనున్నాయి. పోఖ్రాయాన్, ఒరాయ్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో 2-ఏసీ, 3-ఏసీ, 3-ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
టికెట్ చెకింగ్ డ్రైవ్
{{/usCountry}}ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో 2-ఏసీ, 3-ఏసీ, 3-ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
టికెట్ చెకింగ్ డ్రైవ్
{{/usCountry}}పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, అనధికార ప్రయాణాలను అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. నిజమైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మూడు రోజులు జోనల్ స్థాయిలో విస్తృతమైన టికెట్ తనిఖీ డ్రైవ్ను నిర్వహించింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి మొత్తం మీద టికెట్ చెకింగ్ చేశారు. ఈ తనిఖీ సమయంలో టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులు, క్రమరహితంగా ప్రయాణించేవారు, బుక్ చేయని లగేజీని తీసుకువెళ్లే ప్రయాణికులకు జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేసే ప్రయాణికులు, రైల్వే ప్రాంగణంలో చెత్త వేసేవారు, అనధికారిక వ్యాపారులకు కూడా జరిమానా విధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ డ్రైవ్లో భాగంగా టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్న / క్రమరహితంగా ప్రయాణిస్తున్న 13,964 మంది ప్రయాణికులను, బుక్ చేయని లగేజీని తీసుకువెళ్తున్న 1,189 మంది ప్రయాణికులను గుర్తించారు. టిక్కెట్టు తనిఖీ ద్వారా రూ.1.28 కోట్ల ఆదాయాన్ని రాబట్టారు. ఇది కాకుండా రైల్వే ప్రాంగణంలో చెత్త వేస్తున్న 37 మంది ప్రయాణికులను గుర్తించి రూ.6400 జరిమానా విధించారు. ఇంకా 5 మంది అనధికారిక వీధి వ్యాపారులను గుర్తించి రూ.10,000 జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేస్తున్న 7 మంది ప్రయాణికులను గుర్తించి రూ.14,000 జరిమానా విధించారు.
ఈ డ్రైవ్ సందర్భంగా టిక్కెట్ తనిఖీ సిబ్బంది సరైన టిక్కెట్లతో ప్రయాణించడం ప్రాముఖ్యత గురించి ప్రయాణికులకు సలహా ఇచ్చారు. వివిధ ఉల్లంఘనలకు విధించే జరిమానాల గురించి కూడా అవగాహన కల్పించారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాలలో ధూమపానం చేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి కూడా ప్రయాణికులకు తెలియజేశారు. ప్రయాణికులు సరైన, చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించాలని , టిక్కెట్ తనిఖీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. రైల్వే నియమాలను పాటించాలని, పరిశుభ్రతను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది.