Telangana Govt : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత - ప్రతిపాదనలు సిద్ధం..!

తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వోద్యోగుల జీతాల్లో కోత విధించనున్నారు. ఇదే అంశాన్ని తెలంగాణ సర్కార్ పరిశీలిస్తోంది.  

Published on: Mar 23, 2026, 12:26:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు కోత పడనుంది. ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 శాతం వరకు వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్

కేబినెట్ లో చర్చ…!

వేతనాల్లో కోత విధించే ప్రతిపాదనను ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఈ ప్రతిపాదనపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి… ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సభ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆర్థికంగా సురక్షితమైన కుటుంబాలలో కూడా వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఉద్యోగులైతే… వారి తల్లిదండ్రుల విడిచిపెట్టడంతో… అలాంటి వారి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడమే ఈ కొత్త చట్టం లక్ష్యం.

ఈ చట్టం అమల్లోకి వస్తే… ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల జీవితానికి ఎంతో రక్షణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విఫలమైన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

కుటుంబ విలువలను నిలబెట్టడం, సీనియర్ సిటిజన్ల గౌరవాన్ని కాపాడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ …. ఇటువంటి చర్యను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సూచించారు.

ఈ ప్రతిపాదనను వేగంగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని ఆమోదించడానికి ప్రయత్నించవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే…. ఉద్యోగుల జీతాలను తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలతో నేరుగా అనుసంధానించిన మొదటి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా అవతరించవచ్చు.

ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశం తర్వాత ముసాయిదా చట్టం మరియు దాని అమలు యంత్రాంగాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More