TG DOST 2026 Web Options : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా…. తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసి…. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
డిగ్రీ మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15నే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మే 7వ తేదీతో ముగియనుంది. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్న వారు నేరుగా వెబ్సైట్ ద్వారా, లేని వారు హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
ప్రాధాన్యతే కీలకం…
దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ఘట్టం. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక… గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే (Edit) సదుపాయం ఉంటుంది.
మే 14న సీట్ల కేటాయింపు…
డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
దోస్త్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
దోస్త్ ముఖ్యమైన తేదీలు ఇవే:
- మొదటి విడత రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2026
- వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ : మే 8, 2026 వరకు
- మొదటి విడత సీట్ల కేటాయింపు: మే 14, 2026
- ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుండి మే 23, 2026 వరకు
- అధికారిక వెబ్ సైట్ - https://dost.cgg.gov.in
దోస్త్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
దోస్త్ ముఖ్యమైన తేదీలు ఇవే:
- మొదటి విడత రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2026
- వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి తేదీ : మే 8, 2026 వరకు
- మొదటి విడత సీట్ల కేటాయింపు: మే 14, 2026
- ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుండి మే 23, 2026 వరకు
- అధికారిక వెబ్ సైట్ - https://dost.cgg.gov.in