విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్ - కెరీర్ గైడెన్స్ కావాలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి
విద్యార్థుల కోసం తెలంగాణ విద్యాశాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కెరీర్ గైడెన్స్ పై సందేహాలను తీర్చి మార్గనిర్దేశం చేసేందుకు 18004252428 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకొచ్చింది.
ప్రస్తుత రోజుల్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సరైన గైడెన్స్ లేకపోతే… చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈ తరహా అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో…. ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యుగంలో ప్రతిది క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే పట్టణ ప్రాంత విద్యార్థులతో పోల్చితే…. గ్రామీణ విద్యార్థులు సమాచారం తెలుసుకోవటం కొంత ఇబ్బందికరమే..! అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా తెలంగాణ విద్యాశాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎడ్యుకేషన్, కెరీర్ అవకాశాలపై పాఠశాల విద్యార్థుల సందేహాలను తీర్చే దిశగా విద్యాశాఖ అడుగు ముందుకేసింది. యూనిసెఫ్, నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో కలిసి సమగ్ర శిక్షా విభాగం 18004252428 అనే టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు పలు అంశాల్లో మార్గనిర్దేశం చేసి… కెరీర్ గైడెన్స్ ఇవ్వనుంది.
ఈ తరహా సేవలు ముఖ్యంగా టెన్త్ విద్యార్థులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. టెన్త్, ఇంటర్ ఇంటర్ తర్వాత అందుబాటులో ఉండే కోర్సులు, ఉపాధి అవకాశాలను ఈ ప్రత్యేక సేవల ద్వారా వివరిస్తారు.
నైపుణ్యాభివృద్ధి, స్కాలర్షిప్లు తదితర వాటి గురించి ఫోన్లోనే నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
టైమింగ్స్ ఇలా….
ఆసక్తిగల విద్యార్థులు 18004252428 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఈ నెంబర్ పని చేస్తుంది. సెలవులు మినహాయిస్తే స్కూల్ పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం దీన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈ తరహా సేవలను తీసుకురావటంతో గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. టెన్త్ తర్వాత ఎలాంటి కోర్సులు చదివితే ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దానిపై ఓ అవగాహనకు కూడా రాగలుగుతారు. ఇంటర్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై కూడా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నిర్ణయాలతో సంబంధం లేకుండా విద్యార్థి ఆసక్తి మేరకు నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ సేవలు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











