2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణకు 60 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు
జాతీయ వైద్య కమిషన్ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు సూపర్ స్పెషాలిటీ సీట్లను మంజూరు చేసింది. తెలంగాణలో మెడికల్, సర్జికల్ విభాగాల్లో కొత్తగా 69 సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
జాతీయ వైద్య కమిషన్(NMC) జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం తెలంగాణకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరు అయ్యాయి. ఈ ఆమోదాలు డీఎం, M.Ch కోర్సులలో కొత్త, పెరిగిన ప్రవేశాలను కవర్ చేస్తాయి. మెడికల్, సర్జికల్ విభాగాల్లో కొత్తగా 60 సీట్లు అందుబాటులోకి వచ్చినట్టైంది. కౌన్సెలింగ్ ప్రయోజనాల కోసం డీమ్డ్ లెటర్స్ ఆఫ్ పర్మిషన్గా పరిగణించనున్నట్టుగా కమిషన్ తెలిపింది.

ప్రభుత్వ సంస్థలలో 38 సీట్లు క్లియర్ అయ్యాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాద్కు 4 డీఎం మెడికల్ ఆంకాలజీ, 3 M.Ch సర్జికల్ ఆంకాలజీ సీట్లతో సహా 7 సీట్లు వచ్చాయి. గాంధీ మెడికల్ కాలేజీ సికింద్రాబాద్కు డీఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ సీట్లను మంజూరు చేసింది.
కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ డీఎం కార్డియాలజీ (2), M.Ch కార్డియో థొరాసిక్, వాస్కులర్ సర్జరీ (2), M.Ch యూరాలజీ (2), M.Ch ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ (2), M.Ch పీడియాట్రిక్ సర్జరీ (2)తోపాటుగా పలు విభాగాల్లో 10 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక కేటాయింపు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) హైదరాబాద్కు దక్కింది. దీనికి 16 సీట్లు వచ్చాయి. వీటిలో M.Ch సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (4), M.Ch వాస్కులర్ సర్జరీ (4), M.Ch సర్జికల్ ఆంకాలజీ (4), DM ఓంకో పాథాలజీ (4)కి ఒక్కోదానికి నాలుగు సీట్లు దక్కాయి.
ప్రైవేట్ రంగంలో సిద్ధిపేటలోని R.V.M. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్కు 22 సీట్లు కేటాయించారు. ఈ అనుమతులలో M.Ch సర్జికల్ ఆంకాలజీ (2), M.Ch సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (2), M.Ch ప్లాస్టిక్,రీకన్స్ట్రక్టివ్ సర్జరీ (2), M.Ch న్యూరోసర్జరీ (2), M.Ch కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ (2), DM మెడికల్ ఆంకాలజీ (2), DM నియోనాటాలజీ (2), DM న్యూరాలజీ (2), DM మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (4)స DM కార్డియాలజీ (4) ఉన్నాయి.
రాష్ట్రంలో నిమ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇప్పటివరకు సుమారు 250 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉండగా.. కొత్త వచ్చిన 60తో 310 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


