...
...
Next Story

Telangana : నీటి సంర‌క్ష‌ణ‌ే లక్ష్యం - ఆగ‌స్టు 15 వ‌ర‌కు ల‌క్ష ఇంకుడు గుంత‌లు

తెలంగాణలో నీటి సంరక్షణ లక్ష్యంగా ఆగస్టు 15 నాటికి లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Published on: Jul 26, 2026, 08:13:53 IST
Advertisement

Telangana Soak Pits : రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపకంతో పాటు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

మంత్రి సీతక్క సమీక్ష
మంత్రి సీతక్క సమీక్ష

శనివారం సచివాలయం నుంచి స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డిఆర్డిఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు మరియు పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వీబీ జీ రాంజీ (VB G RAM G), తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు.

ఆగస్టు 7 నుంచి జిల్లాల్లో సమీక్షలు

పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించేందుకు ఆగస్టు 7వ తేదీ నుంచి జిల్లాల వారీగా స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరేలా అధికారులు పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

గ్రామీణాభివృద్ధికి గ్రామసభలే కేంద్ర బిందువుగా మారాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో తప్పనిసరిగా గ్రామాల వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రాంజీ పథకం పరిధిలో ఉన్న 318 రకాల పనుల్లో…. ఆయా గ్రామాల అవసరాలకు తగిన పనులను తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

వాతావరణంలో సంభవిస్తున్న ఎల్‌నినో ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని చెప్పారు.

'తెలంగాణ జలసిరి'లో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఫార్మ్ పాండ్ (పంట కుంట), ఊట కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలను ప్రజా భాగస్వామ్యంతో యుద్ధప్రాతిపదికన చేపడతారు. అదేవిధంగా…. గ్రామాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GP SAP)ను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe