విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను ఆధారంగా ఆమోదం తెలిపినట్టుగా భట్టి విక్రమార్క వెల్లడించారు.

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు భత్యమే డీఏ. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్(డీఏ)/డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్)ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు డీఏను 17.651 శాతంగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. 1/7/2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు డీఏ/డీఆర్ను 17.651 శాతంగా నిర్ణయించారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారు.
విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఈ డీఏ భత్యం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారులలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TG TRANSCO) 3,036 మంది ఉద్యోగులు, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGGENCO) 6,913 మంది ఉద్యోగులు, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) 11,957 మంది ఉద్యోగులు, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) 9,728 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కార్మికులు, పెన్షనర్లు కూడా ఉన్నారని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
దీనివల్ల విద్యుత్ సంస్థలపై నెలవారీగా రూ.9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు ఆమోదం తెలిపారు.
{{/usCountry}}దీనివల్ల విద్యుత్ సంస్థలపై నెలవారీగా రూ.9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు ఆమోదం తెలిపారు.
{{/usCountry}}చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డీఏ అంశం కొలిక్కి రావడంతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జూలై 2025 నుంచి వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడంపై భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపాయి.