గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని, అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.

Published on: Dec 03, 2025 4:19 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారన్నారు. జగన్ ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ అక్రమాలకు అరికట్టేందుకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కూటమితో ఎన్నికలకు వెళ్లామన్నారు.

రైతులతో చంద్రబాబు
రైతులతో చంద్రబాబు

'ముందుగా రైతుల సమస్యలు పరిష్కారించాలని అనుకున్నాం. దాని తర్వాత మిగతా సమస్యల మీద దృష్టి సారించాం. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి ఆరు శాతం ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువ. ఆదాయం తక్కువ. వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. మేం రూపాయి ఇస్తే మీరు రూపాయి ఖర్చు పెట్టాలి. ' అని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే యాంత్రికరణ జరగలన్నారు. పండించే పంట విలువ ఇక్కడ పరిస్థితిపై ఆధారపడి ఉండదని, ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి అని చంద్రబాబు అన్నారు.

వ్యవసాయం సమస్యను పరిష్కరించేందుకు పంచ సూత్రాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా నీటి భద్రత కల్పించాలని భావించామన్నారు. కనీసం మన రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు.

'గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తరలిస్తాం. భూమిని జలాశయంగా చేసి, భూగర్భ జలాలు పెంచితే నీటి సమస్య రాదు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది. గతంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోం అని మరోసారి చెబుతున్నా. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తున్నాం. గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా నదికి వరకు తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్‌లో తాగేందుకు, వ్యవసాయానికి, పారిశ్రామిరంగానికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతన్నకు అండగా ఉంటామనేది మా మెుదటి నినాదం.' అని చంద్రబాబు అన్నారు.

News/Andhra Pradesh/గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు
News/Andhra Pradesh/గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు