...
...
Next Story

Telangana ITI Admissions 2026 : ఐటీఐ అడ్మిషన్ల అప్డేట్ - జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

Telangana ITI Admissions 2026 : ఐటీఐ ప్రవేశాల(ఆగస్టు సెషన్‌ -2026) మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. జూలై 10, 2026 వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.

Published on: Jul 3, 2026, 17:34:53 IST
Advertisement

Telangana ITI Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో (ITIs), అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లలో (ATCs) ఎన్‌సీవీటీ (NCVT)ల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జూలై 10, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో…. దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • విద్యా అర్హత : 8వ తరగతి లేదా 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత ట్రేడులను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • వయస్సు: అభ్యర్థులు 01-08-2026 నాటికి కనీసం 14 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని ఉండాలి. అయితే, 'డ్రోన్ టెక్నీషియన్' (Drone Technician) ట్రేడ్ కొరకు కనీసం 16 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కింద ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు.
  • దరఖాస్తు విధానం మరియు ఎంపిక ప్రక్రియ : ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iti.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు మరియు వెరిఫికేషన్ ఫీజు కింద రూ. 100/- ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి.
  • అభ్యర్థులు సింగిల్ అప్లికేషన్ ద్వారానే రాష్ట్రంలోని ఎన్ని ఐటీఐలకైనా, ట్రేడులకైనా తమ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక (Physical) దరఖాస్తులు స్వీకరించబడవు.

ఎంపిక విధానం….

ఐటీఐ అడ్మిషన్ల అప్డేట్ - జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఐటీఐ అడ్మిషన్ల అప్డేట్ - జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారానే పరిశీలిస్తారు. అభ్యర్థికి పదో తరగతిలో (SSC) వచ్చిన మెరిట్ మార్కులు మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు లభించిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా సమాచారం అందుతుంది.

దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ వివరాలు పదో తరగతి మెమోలో ఉన్నట్లుగానే సరిచూసుకోవాలి. అలాగే…. దరఖాస్తులో సమర్పించే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ మరియు ఆధార్ వివరాలు తప్పనిసరి. కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబర్ మార్చకూడదని, నంబర్ మారితే అడ్మిషన్ రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe