...
...
Next Story

Professional Tax : ప్రొఫెషనల్ టాక్స్‌పై ప్రభుత్వం ఫోకస్.. డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు!

Professional Tax : తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలు, అధ్యాపకుల నుండి వృత్తిపరమైన పన్ను వసూలు చేయనుంది. ఈ మేరకు డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Published on: Mar 8, 2026, 17:53:54 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం 11,000లకు పైగా ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, వాటి బోధనా సిబ్బందిపై ప్రొఫెషనల్ టాక్స్ విధించాలని యోచిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలు, వారి బోధనా సిబ్బంది నుండి ఆస్తిపన్ను వసూలు చేయడాన్ని పర్యవేక్షించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ రెండు రోజుల క్రితం అన్ని జిల్లా విద్యా అధికారులకు(DEO) ఆదేశాలు జారీ చేశారు. పన్ను వసూలు చేయడంలో విఫలమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

ప్రొఫెషనల్ టాక్స్‌
ప్రొఫెషనల్ టాక్స్‌

ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటాయని కూడా నవీన్ నికోలస్ హెచ్చరించారు. తెలంగాణ ప్రొఫెషనల్ టాక్స్ చట్టం, 1987 ప్రకారం, విద్యా వృత్తి, వివిధ వ్యాపార వృత్తులలో నిమగ్నమైన అన్ని ఉద్యోగులు వృత్తిపరమైన పన్ను చెల్లించాల్సి ఉంటుందని నికోలస్ పేర్కొన్నారు. సంస్థలు, వ్యాపారాల యజమానులు వృత్తిపరమైన పన్నును రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని కూడా అన్నారు.

నివేదికల ప్రకారం.. విద్యా శాఖ.. వాణిజ్య పన్ను శాఖతో కలిసి పన్ను చొరవ విధివిధానాలను రూపొందిస్తోంది. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ సంస్థల నుండి ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తే, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు చెల్లించే.. ముందే టాక్స్‌ను కట్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యత డీఈవోలదని స్పష్టం చేశారు. 'మీ జిల్లా పరిధిలోని ప్రైవేట్ స్కూళ్లలో వృత్తి పన్ను అమలయ్యేలా చూడాలి. గతంలో జారీ చేసిన జీవో 610, 497 ప్రకారం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. వసూలు చేసిన మెుత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలి.' అని నవీన్ నికోలస్ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe