కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారా..? అయితే అదనంగా మీ వద్ద డబ్బులు ఉండాల్సిందే…! ఎందుకంటే ఈ మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ సెస్ (రోడ్డు భద్రత పన్ను) వసూలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

{{^htLoading}} {{/htLoading}}
మోటర్ వెహికల్ యాక్ట్ చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం….. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా రోడ్డు భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణలో రోడ్డు సెఫ్టీ సెస్ - ముఖ్యమైన వివరాలు:
- ఈ మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణలో రోడ్డు సెఫ్టీ సెస్ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
- కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 వరకు రోడ్డు భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటు ఇతర వ్యక్తిగత వాహనాలు, ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఈ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తాయి.
- ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ.270 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
- వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
- తేలికపాటి వాహనలైన ద్విచక్రవాహనాల కొనుగోలు చేసే సమయంలో ఈ పన్ను కింద రూ. 2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- కార్ల వంటి వాటికి రూ.5 వేలు వసూలు చేస్తారు. గూడ్స్ వెహికల్స్, ఆటోలకు రూ.10 వేల వరకు పన్ను పడొచ్చు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}