తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 - ఇవాళ్టి నుంచి 3వ విడత నామినేషన్లు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా… ఇవాళ్టి నుంచి చివర దశ నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా మొత్తం 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా…. చివరి విడత నామినేషన్లు ఇవాళ్టి నుంచి స్వీకరిస్తారు. ఇందుకోసం ఆయా గ్రామ పంచాయతీల్లో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇవాళ్టి నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆ తరువాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన తర్వాత… ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు.
ముగిసిన రెండో విడత నామినేషన్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు, 38,342 వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించారు.
రెండో విడత నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. డిసెంబర్ 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. ఇదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ నిర్వహించి… ఫలితాలను ప్రకటిస్తారు. ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

