రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించటంతో పాటు ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం…. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించటం లేదు.
రేపట్నుంచే నామినేషన్లు…
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు.
నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు.
- తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి.
- రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ ఉంటుంది.
- మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
అమల్లోకి ఎన్నికల కోడ్…
సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రావటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు, అబ్కారీ శాఖ వాళ్లు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తారు.
{{/usCountry}}సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రావటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు, అబ్కారీ శాఖ వాళ్లు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తారు.
{{/usCountry}}తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర అవసరమైన, ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా.. తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.