యూఏఈలో తెలంగాణ వ్యక్తి మృతి.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 16 గంటలు మృతదేహం

యూఏఈలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి మరణించారు. అయితే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి 16 గంటల సమయం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

Published on: Feb 23, 2026 6:29 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో మరణించిన తెలంగాణకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న దాదాపు 16 గంటల తర్వాత ఆయన కుటుంబానికి అప్పగించారు. దీని ఫలితంగా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల ఏర్పాట్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన నరేందర్ నర్సయ్య శ్రీరామ్ ఫిబ్రవరి 16న షార్జాలో గుండెపోటుతో మరణించారు.

ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు షార్జా నుండి ఎయిర్ అరేబియా విమానంలో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. రాక గురించి తమకు ముందస్తుగా సమాచారం అందించలేదని, దీనివల్ల గందరగోళం ఏర్పడిందని, కార్గో ఫార్మాలిటీలను పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతుడి బంధువు దామోదర్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఎయిర్‌లైన్ కార్గో విభాగం నుండి తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ప్రక్రియలను పూర్తి చేశారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని అప్పగించారు. సుమారు 16 గంటల తర్వాత అప్పగించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహానికి కొన్ని గంటల్లో అంత్యక్రియలు పూర్తి చేసేలా సంప్రదాయం ఉంటుందని కుటుంబ సభ్యులు అన్నారు. నర్సయ్య మృతదేహానికి సంబంధించిన విషయం చెరవేయడంలో జాప్యం జరిగిందంటున్నారు. యజమాని, విమానయాన సిబ్బంది మధ్య సమన్వయ లోపం వల్లే అంత్యక్రియల ఆలస్యమైందన్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత అంత్యక్రియల ఆచారాలను తిరిగి చేసినట్టుగా చెప్పుకొచ్చారు.

ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీమ్ రెడ్డి జోక్యం చేసుకుని ఎయిర్‌లైన్ అధికారులను సమన్వయం చేసి ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. మెుత్తానికి నర్సయ్య అంత్యక్రియలు అనుకున్న సమయంలో జరగలేదు. దీంతో ఆలస్యంగా కార్యక్రమాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. అధికారులు సరైన సమయంలో సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు.