పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘర్షణల మధ్య అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అతని తల్లిదండ్రులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్.రాజేశ్వరరావు ఈ సంఘటనలో గాయపడ్డారని అతని తండ్రి ప్రభాకర్ రావు తెలిపారు.

విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. తాను, అనేక మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
'నా కొడుకు ఒక సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నాడు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దాడిలో అతనికి గాయాలు అయ్యాయి. వీడియో కాల్ ద్వారా మాతో మాట్లాడాడు. కానీ మాకు గాయాలను చూపించడం లేదు. నా కొడుకు త్వరగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను' అని ప్రభాకర్ రావు తెలిపారు. రాజేశ్వరరావును భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. తమ కొడుకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల బృందం, గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కారణంగా తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. మదీనాకు ప్రయాణించిన యాత్రికులు సౌకర్యాలు, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. విమానాల రద్దు కారణంగా తాను హైదరాబాద్కు తిరిగి రావడం ఆలస్యమైందని మొహమ్మద్ అబ్దుల్ రజాక్ పీటీఐతో అన్నారు. అయితే తన వసతి, ఇతర ఏర్పాట్లను ట్రావెల్ ఏజెన్సీ చూసుకుందని వెల్లడించారు.
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ నుండి లండన్, అమెరికాకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పెరుగుతున్న ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, రద్దు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా పెంచాయి. పలు ప్రాంతాల గగనతలంలో అంతరాయాల కారణంగా విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించి, సేవలను సర్దుబాటు చేయడంతో ధరలు పెరిగాయి.
{{/usCountry}}మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ నుండి లండన్, అమెరికాకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. పెరుగుతున్న ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, రద్దు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా పెంచాయి. పలు ప్రాంతాల గగనతలంలో అంతరాయాల కారణంగా విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించి, సేవలను సర్దుబాటు చేయడంతో ధరలు పెరిగాయి.
{{/usCountry}}హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య విమాన కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైంది. హైదరాబాద్ నగరం, UAE మధ్య రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి.