తెలంగాణ అంతటా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అనేక మార్కెట్లలో మెున్నటి దాకా ముప్పై నలభై పలికిన ధరలు ఒకేసారిగా పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60కి నుంచి రూ.80కి మధ్యలో పలుకుతున్నాయి. మరికొన్ని రోజుల్లో సెంచరీకి చేరువ అవుతాయి. కొన్ని రోజుల క్రితం కిలో రూ.40 చొప్పున అమ్ముడైన ఉల్లిపాయల ధరలు ఇప్పుడు మరింత పెరగడంతో, సామాన్యుల ఇంటి బడ్జెట్పై భారం పడుతోంది.

మహారాష్ట్రలోని నాసిక్ ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి, తెలంగాణకు కీలక సరఫరాదారుగా ఉంది. మహారాష్ట్ర నుండి ఉల్లిపాయలు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మార్కెట్లకు వస్తుంటాయి. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రాంతం నుండి కూడా తెలంగాణకు ఉల్లిపాయలు సరఫరా అవుతాయి.
కొత్త పంట రావడంలో జాప్యం, ప్రధాన ఉల్లి సాగు ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సరఫరా తగ్గి, ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. గతంలో వినియోగదారులు రూ.100కు దాదాపు 3 కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేసేవారు. కానీ ధరల పెరుగుదల కారణంగా ఇప్పుడు ఆ పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది.
ఈ పరిస్థితి హోల్సేల్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. హైదరాబాద్లోని మలక్పేట ఉల్లి మార్కెట్లో గతంలో రోజుకు సుమారు 25,000 బస్తాల వరకు వచ్చే సరుకు, ఇప్పుడు 15,000 నుండి 17,000 బస్తాలకు తగ్గిందని వ్యాపారులు తెలిపారు.
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. కొన్ని పొలాలు నీట మునిగాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం కూడా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఈ కారణాలన్నీ సరఫరా కొరతకు దారితీశాయని వ్యాపారులు చెప్పారు.
ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల నుండి సరఫరా తగ్గడంతో తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, చెన్నైతోపాటుగా అనేక ప్రధాన నగరాలు, రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ధరల కారణంగా గతంతో పోలిస్తే తమకు సుమారు 30-40 శాతం అధిక ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులు మోయాల్సి వస్తోంది.
{{/usCountry}}ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల నుండి సరఫరా తగ్గడంతో తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, చెన్నైతోపాటుగా అనేక ప్రధాన నగరాలు, రాష్ట్రాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ధరల కారణంగా గతంతో పోలిస్తే తమకు సుమారు 30-40 శాతం అధిక ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులు మోయాల్సి వస్తోంది.
{{/usCountry}}ఖరీఫ్ ఉల్లి పంట ఇంకా మార్కెట్లకు తగినంత పరిమాణంలో రాలేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొత్త సరకు రాక పెరిగే వరకు ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉంది. లేదా మరింత పెరగవచ్చు. డిసెంబర్ నాటికి కొత్త పంట పెద్ద మొత్తంలో మార్కెట్కు వచ్చే అవకాశం ఉన్నందున, అప్పుడు పరిస్థితి మెరుగుపడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఉల్లి సరఫరా కోసం మహారాష్ట్రపై ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా అక్కడ పండించే ఉల్లిపాయల నాణ్యత, లభ్యత దీనికి కారణం. దీంతో మహారాష్ట్ర నుండి సరఫరాలో ఏ చిన్న అంతరాయం వచ్చినా.. తెలంగాణలో ఉల్లి మార్కెట్పై ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు పెరిగిన ధరలతో సామాన్యుడి బడ్జెట్పై ఎఫెక్ట్ చూపిస్తోంది.