భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా రూ. 4,18,931కి చేరిందని వెల్లడించారు. ఈ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు 91 శాతం అధికంగా ఉందని వివరించారు. గోల్కొండ కోటలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.50 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, జాతీయ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో రాష్ట్రం ఏకంగా 5 శాతం భాగస్వామ్యాన్ని కలిగి ఉందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని 10 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర సమగ్ర వికాసం కోసం తమ ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047," అని ఆయన ప్రకటించారు.
రాజీపడే ప్రసక్తే లేదు - సీఎం రేవంత్
నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ… "కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం" అని స్పష్టం చేశారు.
"రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత నిచ్చింది," అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిలోనూ తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
{{/usCountry}}"రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత నిచ్చింది," అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిలోనూ తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
{{/usCountry}}రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. పేదల ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి భరోసా ఇచ్చేలా సన్నబియ్యం పంపిణీని విప్లవాత్మక పథకంగా అమలు చేస్తున్నామన్నారు.
విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని, కేంద్రం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి మెరుగుపడిందని సీఎం తెలిపారు.
యువతకు ఉపాధి కల్పనపై మాట్లాడుతూ…. "ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలు అందించాం. టీజీపీఎస్సి ద్వారా 456 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7437 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చాం" అని వివరించారు.