Janasena Party Nava Nirmana Sankalpa Sabha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నగరంలో జూన్ 2వ తేదీన తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం’ సమావేశానికి చుక్కెదురైంది. ఈ సభకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగనున్న నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల (Law & Order) పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు తక్షణమే స్పందిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
పోలీసుల నిర్ణయంపై జనసేన పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా ఎలాంటి భారీ సభను నిర్వహించడం లేదని…. ఇండోర్ కన్వెన్షన్ సెంటర్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కేవలం 'ఆత్మీయ సాధక్ సమావేశం' మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు. హాలులో లేదా కన్వెన్షన్ సెంటర్లో అంతర్గతంగా నిర్వహించుకునే ఇలాంటి సమావేశాలకు పోలీసులకు కేవలం ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుందని….. దీనికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
నిరాకరించడం సహేతుకం కాదు - జనసేన పార్టీ ప్రకటన
అనుమతి నిరాకరణపై జనసేన పార్టీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.
"తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2000 మంది జనసేన సాధక్ లతో ఒక ఇండోర్ కార్యక్రమం నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పోషించాల్సిన పాత్ర, జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకునే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అర్థరహితం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వ్యాఖ్యలను ఆయనే ఉపసంహరించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కూడా చర్యలు ఉండవు అని పవన్ కళ్యాణ్ ప్రజాముఖంగానే తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి నిరాకరించడం సహేతుకం కాదు" అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎలాంటి సరైన, బలమైన కారణాలు చూపకుండానే పోలీసులు కావాలనే తమ సమావేశానికి అనుమతి నిరాకరించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జూన్ 2న జరగాల్సిన ఈ సాధక్ సమ్మేళనానికి అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసుల అభ్యంతరాలను సవాల్ చేస్తూ…. సమావేశ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకులు అత్యవసరంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే రేపటి పవన్ కల్యాణ్ పర్యటన. సమావేశంపై స్పష్టత రానుంది.
{{/usCountry}}ఎలాంటి సరైన, బలమైన కారణాలు చూపకుండానే పోలీసులు కావాలనే తమ సమావేశానికి అనుమతి నిరాకరించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జూన్ 2న జరగాల్సిన ఈ సాధక్ సమ్మేళనానికి అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసుల అభ్యంతరాలను సవాల్ చేస్తూ…. సమావేశ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతూ జనసేన నాయకులు అత్యవసరంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే రేపటి పవన్ కల్యాణ్ పర్యటన. సమావేశంపై స్పష్టత రానుంది.
{{/usCountry}}మరోవైపు పవన్ హైదరాబాద్ సభ నేపథ్యంలో… తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని వ్యక్తి… ఎలా సభ పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను దిష్టితో పోల్చారని… అలాంటి పవన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.