Telangana Ration Rice Distribution : తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం ఉచిత పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను తీసుకోలేకపోయిన పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది. తాజా ఆదేశాల ప్రకారం…. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది.
గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. మొదటగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఈ బృహత్తర ప్రక్రియ ఆగస్ట్ 1వ తేదీన ప్రారంభమైన ఈ పంపిణీ…. ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది.
ఒకేసారి మూడు నెలల బియ్యం ఉచితంగా ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రతీ షాపు వద్ద రేషన్ కార్డుదారులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికితోడు ఇటీవల వచ్చిన రాఖీ పౌర్ణమి పండుగ కారణంగా వేలాది మంది ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీంతో నిర్ణీత సమయంలో చాలామందికి తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకునే వీలు లేకుండా పోయింది. చివరి రోజుల్లో కూడా డీలర్ల వద్ద రద్దీ తీవ్రమవ్వడంతో పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో సాగలేదు.
ఈనెల 5 వరకు గడువు పొడిగింపు…
ఈ ఇబ్బందులన్నింటి దృష్ట్యా పౌరసరఫరాల శాఖ గడువు పొడిగించేందుకు సిద్ధమైంది. అర్హులైన పేద లబ్ధిదారులు ఏ ఒక్కరూ కూడా తమకు రావాల్సిన 3 నెలల బియ్యం కోటాను నష్టపోకూడదనే ఉదార ఉద్దేశంతోనే ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు అన్ని డిపోల్లోనూ బియ్యం లభ్యమవుతాయి.
{{/usCountry}}ఈ ఇబ్బందులన్నింటి దృష్ట్యా పౌరసరఫరాల శాఖ గడువు పొడిగించేందుకు సిద్ధమైంది. అర్హులైన పేద లబ్ధిదారులు ఏ ఒక్కరూ కూడా తమకు రావాల్సిన 3 నెలల బియ్యం కోటాను నష్టపోకూడదనే ఉదార ఉద్దేశంతోనే ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు అన్ని డిపోల్లోనూ బియ్యం లభ్యమవుతాయి.
{{/usCountry}}ఇప్పటివరకు సరుకులు తీసుకోని రేషన్ కార్డుదారులు ఈ అదనపు సమయాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 5 గడువు ముగిసిన తర్వాత మళ్లీ అదనంగా సమయం ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాబట్టి మిగిలిపోయిన కార్డుదారులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ/బయోమెట్రిక్ ప్రక్రియ ద్వారా తమ బియ్యాన్ని తెచ్చుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.